పూజా బాత్రా గురించి బాలీవుడ్ హీరోయిన్. మిస్ ఫెమినా ఇండియా విజేతగా నిలిచిన తరువాత మోడల్ గా మంచి గుర్తింపు పొందింది. 1995 నుంచి సినిమాల్లో నటించినా.. 1997 లో వచ్చిన విరాసత్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత వరసగా సినిమాలు చేసింది. దాదాపు బాలీవుడ్ లో 20 సినిమాలు చేసింది.
ఇక, నాగార్జున సిసింద్రీ సినిమాలో పూజ బాత్రా అతిధి పాత్ర చేసింది. చేసింది చిన్న పాత్రే అయినా మంచి పేరు తెచ్చుకుంది. 1998 లో వచ్చిన గ్రీకు వీరుడు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన తరువాత 2002 లో డాక్టర్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది.
అమెరికా వెళ్లిన కొన్ని రోజులకు అంటే 2011 లో భర్త నుంచి విడిపోయి ఇండియా వచ్చేసింది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హల్చల్ చేస్తూనే ఉన్నది. రీసెంట్ గా ఈ అమ్మడు ఓ ఫోటోను పోస్ట్ చేసింది. టాప్ బ్రా, షార్ట్ నిక్కర్ తో ఫోజులు ఇచ్చింది. నిక్కర్ జిప్ ఓపెన్ చేసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ అమ్మడి వయసు ఎంత అన్నది ఆ ఫోటో చూస్తే ఖచ్చితంగా చెప్పడం కష్టమే అవుతుంది.
ఇదిలా ఉంటె, ఈ అమ్మడు గత కొంతకాలంగా సినిమా రంగంలో ఉన్న నవాబ్ షా తో పీకల లోతు ప్రేమలో ఉన్నది. ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనుకున్నారు. సడెన్ గా సర్ప్రైజ్ ఇస్తూ.. జులై 4 వ తేదీన మా పెళ్లి జరిగిపోయింది. ఆర్యసమాజ్ పద్దతిలో వివాహం జరిగింది.. అని చెప్పి పూజా బాత్రా పోస్ట్ చేసింది. కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. త్వరలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కు అప్లై చేస్తున్నట్టు పూజా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.