నందిని రెడ్డి దర్శకత్వంలో అందాల భామ సమంత నటించిన ‘ఓ బేబీ’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది. ఓ బేబీ మూవీ ఘనవిజయంతో కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. జులై 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అంటే ఇప్పటికే బయ్యర్లకు లాభాలు మొదలైపోయాయి. నైజాం ఏరియాలో 3.09 కోట్ల షేర్ తో దూసుకుపోతుండగా, గుంటూరులో 48లక్షలు, ఈస్ట్ గోదావరిలో 46లక్షలు, వెస్ట్ లో 38 లక్షలతో ఓ బేబీ వసూళ్లు స్ట్రాంగ్ గా కోనసాగుతున్నాయి.
సీడెడ్ లో కూడా ఈ చిత్ర రన్ బాగానే సాగుతోంది. కాకపోతే వీకెండ్ పూర్తయి వీక్ డేస్లోకి ఎంటరైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 'ఓ బేబీ' బిజినెస్ కాస్త డౌన్ అయ్యింది. ఓవర్సీస్ లో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 'ఓ బేబీ' మూవీ $679,567 వసూలు చేసినట్లు తెలుస్తోంది.
సెకండ్ వీకెండ్ పూర్తయ్యేలోపే ఈ మూవీ 1 మిలియన్ మార్క్ అందుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఇక రెండవ వారం కూడా ఓ బేబీకి పోటీ నిచ్చే స్థాయిలో పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. దీనితో నిర్మాతకు లాభాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా సురేష్ బాబు మంచి లాభాలని ఆర్జించారు.
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కింది.