పుట్టిన రోజు వేడుకలు దూరంగా ఎన్టీఆర్
తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుల పుట్టిన రోజున అభిమానులు కేక్ కట్ చేయడం, పండ్లు, స్వీట్లు పంచడం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ గ్రూపుల రక్తాలను సేకరించి వాటిని బ్లాడ్ బ్యాంకులకు అందజేస్తారు. ఈ అయితే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఓ ప్రముఖ కథానాయకుడు, స్టార్ హీరో దూరంగా ఉంటున్నారు.
మరో రెండు రోజుల్లో (మే 20న) తన పుట్టిన రోజును ఎన్టీఆర్ జరుపుకోవడం లేదు. ప్రతిసారీ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తూ, వారి దగ్గరే ఉంటూ అభిమానాన్ని పంచుకునేవారు. అయితే ఎన్టీఆర్ ఈసారి వేడుకలకు దూరంగా ఉండాటానికి కారణం ఉంది. గతేడాది ఆగస్ట్ 30న హరికృష్ణ రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇప్పటికీ నందమూరి కుటుంబం కోలుకోలేకపోతుంది. ఎంతగా మరిచిపోవాలనుకున్నా కూడా ఇప్పటికీ ఆ ఘోరం కళ్ళముందే ఉంది. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు. మరో మూడు రోజుల్లోనే ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో అభిమానులు కూడా భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు.