తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంట ఎవరంటే వెంటనే చెబుతారు..చైతూ, సమంత అని..ఏం మాయ చేసావే చిత్రం తర్వాత వీరి మద్య ప్రేమ చిగురించింది. మనం చిత్రం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత ఇద్దరూ తిరిగి తెరపై నటించడం మొదలు పెట్టారు. ఈ మద్య సమంత నటించిన చిత్రాలు వరుసగా హిట్ కాగా, చైతూ నటించిన చిత్రాలు యావర్ టాక్ వచ్చాయి. పెళ్లైన తర్వాత మొదటి సారిగా ఈ జంట శివ నిర్వాణ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా 'మజిలీ' నిర్మితమైంది.
ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటూ వస్తుంది. ఇక రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. ఈ సినిమా, వసూళ్లపరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను దూసుకుపోతోంది.
ఇక 17 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది. మొన్న నాని నటించిన జెర్సీ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం పై పెద్దగా ప్రభావం పడలేదు. ఒక వైపున 'జెర్సీ' .. మరో వైపున 'కాంచన 3' థియేటర్స్ లోకి వచ్చినా, 'మజిలీ' ఇంకా ఏ సెంటర్స్ లో తన జోరును చూపిస్తూ ఉండటం విశేషం.