చిరంజీవికి మాట ఇచ్చిన అరవింద్ అసహనంతో బన్నీ !

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవికి అల్లు అరవింద్ ఇచ్చిన మాట అల్లు అర్జున్ కు తీవ్ర అసౌకర్యంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం అరవింద్ అల్లు అర్జున్ చిరంజీవిల మధ్య నలిగిపోతున్నాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే అరవింద్ చిరంజీవికి ఇచ్చిన మాట బన్నీకి నచ్చలేదు అని అంటున్నారు. 

గత కొంత కాలంగా సాయి ధరమ్ తేజ్ సినిమాలు వరస పరాజయాలు పొందుతూ తేజ్ క్రేజ్ బాగా తగ్గిపోవడంతో ఈవిషయమై చిరంజీవి కూడ టెన్షన్ పడుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ పరిస్థుతులలో ఒక మంచి హిట్ తేజ్ కు పడకపోతే అతడిని నిలబెట్టడం కష్టం అన్న అభిప్రాయంలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. 

దీనితో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తన ముద్దుల మేనల్లుడు కెరియర్ సెట్ చేసే విషయంలో అల్లు అరవింద్  సహాయం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పెట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయమని చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. ఈమూవీకి పరుశు రామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

‘గీత గోవిందం’ నిర్మాణసమయంలోనే దర్శకుడు పరుశు రామ్ అరవింద్ గీత ఆర్ట్స్ కు మరో సినిమా చేస్తానని అని అగ్రిమెంట్ చేసుకున్న నేపధ్యంలో ఆప్రాజెక్ట్ ను సాయి ధరమ్ తేజ్ తో తీయమని అరవింద్ కు చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది.  అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ పూర్తి అయిన తరువాత పరుశు రామ్ దర్శకత్వంలో నటించాలి అని లైన్ లో పెట్టుకున్న నేపధ్యంలో ఇప్పుడు పరుశు రామ్ సాయి ధరమ్ తేజ్ వైపు వెళ్ళడం ఇష్టంలేదు అని అంటున్నారు. అయితే ఈవిషయాలను అరవింద్ గ్రహించినా తాను చిరంజీవికి మాట ఇచ్చిన నేపధ్యంలో బన్నీ చిరంజీవిల మధ్య తాను  ఇచ్చిన మాటకోసం నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకి చివరకు అరవింద్ ఈ విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: