జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ‘అరవింద సమేత’ టీజర్ ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయానికి సంబంధించిన టైమ్ ను ఖరారు చేస్తూ ఈరోజు విడుదల చేసిన పోస్టర్ ను చూసి జూనియర్ అభిమానులు కూడ ఖంగారు పడుతున్నట్లు వార్తలు వస్తున్నయి. ఎల్లుండి బుధవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకే ఈటీజర్ లాంచ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేసింది ఈసినిమా యూనిట్.
డార్క్ షేడ్లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో పాటు అతడి ముందు ఒక వ్యక్తి పడి ఉన్నాడు. బ్యాగ్రౌండ్ అంతా కూడా కుర్చీలు బల్లలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అయితే ఈదృశ్యం చూసిన జూనియర్ అభిమానులకు పవన్ ‘అజ్ఞాతవాసి’ వెంటనే గుర్తుకు వచ్చి కలవర పడుతున్నట్లు సమాచారం. ‘అజ్ఞాతవాసి’ టీజర్లో పవన్ కళ్యాణ్ కుర్చీని రౌండ్ గా తిప్పి ఒక కుర్చీ తయారుకావడం వెనుక ఉండే కష్టాన్ని వివరిస్తాడు. అప్పట్లో ఆటీజర్ సంచలనాలు సృష్టించింది.
దానితో ‘అజ్ఞాతవాసి’ పై అప్పట్లో అత్యంత భారీ అంచనాలు కూడ పెరిగిపోయాయి. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత అంచనాల్ని అందుకోలేకపోవడంతో పవన్ అభిమానులకు ఆ మూవీ ఒక పీడ కలలా మారింది. అయితే గడిచిన విషయాలను మరిచిపోకుండా త్రివిక్రమ్ మళ్లీ ‘అరవింద సమేత’ లో ఈకుర్చీ మ్యాజిక్ ఉపయోగించాడా అంటూ జూనియర్ అభిమానులలో కలవరం మొదలైంది.
ఇప్పటికే త్రివిక్రమ్ పెన్నులో అదేవిధంగా అతడి ఆలోచనలలో క్రియేటివిటీ తగ్గింది అని కామెంట్స్ వస్తున్న పరిస్థుతులలో తిరిగి ‘అజ్ఞాతవాసి’ కుర్చీ ‘అరవింద సమేత’ లో కనిపించడం తారక్ అభిమాములకు అనేక భయాలు అనుమానాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈమూవీ టేకింగ్ విషయంలో త్రివిక్రమ్ తడబడుతున్నాడు అని గాసిప్పులు వస్తున్న పరిస్థుతులలో ఈవార్తలతో పాటు ఈ కుర్చీ నెగిటివ్ సెంటిమెంట్ కూడ తోడైతే ‘అరవింద సమేత’ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ సందడి చేస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 11న విడుదల కాబోయే ఈమూవీ ఫలితాన్ని ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్ ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి..