మహేష్ దానయ్యల మధ్య చిచ్చు రేపిన రంగస్థలం !

Seetha Sailaja
ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసిన ‘రంగస్థలం’ మూవీ ఈమధ్యనే శతదినోత్సవ వేడుకలను కూడ జరుపుకుంది. ఇదే సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీ మహేష్ సినిమాల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా కలక్షన్స్ పరంగా ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది.

అయితే ఇది అంతా అందరికీ తెలిసిన విషయాలు వాస్తవానికి ‘భరత్ అనే నేను’ మూవీ ద్వారా నిర్మాత దానయ్యకు 20 కోట్ల లాభం వచ్చిందని అదేవిధంగా ‘రంగస్థలం’ కలక్షన్స్ కన్నా ‘భరత్’ కు ఎక్కువ కలక్షన్స్ వచ్చాయని వివరిస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అయితే నిర్మాత దానయ్య ‘భరత్ అనే నేను’ కలక్షన్స్ విషయంలో ఇలా అందర్నీ తప్పుదోవ పట్టించడానికి గల కారణం అతడికి మెగా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం అంటూ ఆ దిన పత్రిక తన కథనంలో పేర్కొంది.

‘రంగస్థలం’ రికార్డులు ఘనంగా చూపించాలి అన్న ఉద్దేశ్యంతో దానయ్య ‘భరత్ అనే నేను’ కలక్షన్స్ విషయంలో ఇలాంటి వ్యూహం అనుసరించి ఉంటాడు అంటూ ఆ ఆంగ్ల దినపత్రిక ఊహాగానాలను ప్రచురించింది. దీనికితోడు ప్రస్తుతం దానయ్య చరణ్ తో బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తూ ఉండటంతో పాటు త్వరలో చరణ్ జూనియర్ లతో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ చేస్తున్న నేపధ్యంలో దానయ్య ‘భరత్’ కలక్షన్స్ విషయంలో అసలు నిజం దాచాడు అంటూ ఆ పత్రిక తన కథనంలో అభిప్రాయపడింది. 

ఇప్పుడు ఈవిషయాలు మహేష్ దృష్టి వరకు వెళ్ళడంతో దానయ్య పట్ల మహేష్ తీవ్ర అసహనంతో ఉన్నాడన్న విషయాన్ని కూడ ఆపత్రిక పేర్కొంది. అయితే ‘రంగస్థలం’ సినిమాను తీసింది దానయ్య కాదు ఆ సినిమాను తీసింది మైత్రి మూవీస్. ఇలాంటి పరిస్థుతులలో తన సొంత బ్యానర్ పై వచ్చిన ‘భరత్’ సినిమా కలక్షన్స్ ను ఎందుకు దాస్తాడు ఇది అంతా మహేష్ దానయ్యల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు నడుపుతున్న గాసిప్పుల సందడి అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: