ఎవరికీ కలిసిరాని మహానటి 1

Seetha Sailaja
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆసినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడుతో పాటు ఆమూవీలో కీలక పాత్రలలో నటించిన హీరో హీరోయిన్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడి వారికి అవకాశాలు కుప్పలు కుప్పులుగా వచ్చిపడతాయి. ‘బాహుబలి’ తో ప్రభాస్ రానా రాజమౌళిలు నేషనల్ సెలెబ్రెటీలుగా మారిపోయినట్లుగా సూపర్ హిట్ సాధించిన ‘మహానటి’ వల్ల ఎవరికి కలిసి వచ్చింది అన్న ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. 

విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చిన ‘మహానటి’ విడుదలై మరొక మూడు రోజులలో నెలరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈమూవీ కలక్షన్స్ రికార్డుల విషయాలను పక్కకు పెడితే ఈమూవీలో కీలక పాత్రలో నటించిన కీర్తి సురేశ్ సల్మాన్ దుల్కర్ లతో తెలుగులో మూవీలు చేయడానికి ఏప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికీ ప్రయత్నించక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అదేవిధంగా  ఈమూవీకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ సినిమాలు తీయాలని టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలు ఎవరు ఇప్పటికీ నాగ్ అశ్విన్ పై దృష్టి పెట్టకపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది అని అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తాను అని చెప్పినా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

ఇక ‘మహానటి’ సినిమా కోసం అద్భుతమైన పాటల ట్యూన్స్ ఇచ్చిన  మిక్కీ జె మేయర్ కు విపరీతమైన ప్రశంసలు వచ్చినా అతడిని తమ భారీ సినిమాలకు సంగీత దర్శకుడుగా పెట్టుకుంటున్నాం అంటూ ఇప్పటి వరకు ఏ టాప్ ప్రొడక్షన్ హౌస్ ప్రకటన ఇవ్వలేదు. ఇలా ‘మహానటి’ కోసం పనిచేసిన వారందరికీ విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. కానీ చెప్పుకోతగ్గ అవకాశాలు రావడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ‘మహానటి’ ఎవరికీ కలిసిరాకపోయినా ఇప్పటి వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్న అశ్వినీదత్ కు మాత్రం అక్షయపాత్ర లా మారింది అనడంలో ఎటువంటి సందేహంలేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: