“వివాదాల ప్రేయసి” కంగనా రనౌత్ !

ఒక విషయాన్ని సమస్య చేసి రచ్చ రచ్చ చేసి సమాజం లో కలకలం ఆందోళన రేపటం బాలీవుడ్ ప్రఖ్యాత విలక్ష నటి, కథా నాయకి కంగనా రనౌత్ కు వెన్నతో పెట్టిన విద్య. తన వ్యాఖ్యలతో వార్తలలో సంచలనాలు సృష్టిస్తూ నిలవటం ఆమెకు చాలా ఇష్టమని పిస్తుంది. రెండు సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు ఆమెకే బౌన్సర్లై బాకౌట్ అయి ధారుణ అవమానాన్ని మిగిల్చాయి. నటి గా ఆమెకున్న కీర్తి అమోఘమైనా వివాదాలతో తనకు తానే అపకీర్తి తెచ్చుంటుంది. ప్రజల్లో ఆమె పట్ల ఆమె మాటల పట్ల పూర్తి విశ్వాన్ని క్రమంగా పోగొట్టు కుంటుంది. దానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.


 


హృతిక్ రోషన్ తో క్షీణించిన సంబందాలు:  హృతిక్‌ రోషన్‌ తనతో ప్రేమ వ్యవహారం నడిపి మోసంచేసాడంటూ కంగన రనౌత్‌ చేసిన రచ్చతో అతను బయటకి రాకతప్ప లేదు. తమ మధ్య ఏం జరిగిందో, అసలు తనకి కంగన రనౌత్ ఎంత వరకు పరిచయమో, ఆమెతో తనకున్న "ఇంటరాక్షన్‌" ఏమిటో హృతిక్‌ వివరించి చెప్పాడు. ముందుగా బహిరంగ లేఖ రాసిన హృతిక్‌ రోషన్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ వ్యవహారం గురించి కుండబద్దలు కొట్టాడు.




హృతిక్‌ రోషన్ మాట్లాడకపోవడంతో కంగన రనౌత్ నాలుగేళ్ల పాటు మీడియా ముందుకొచ్చి రచ్చ రచ్చ చేసింది. హృతిక్‌ ఎలాంటి మొహమాటం లేకుండా జరిగింది చెప్పడమే కాకుండా ఆమెని ఎక్స్‌పోజ్‌ చేయడంతో అసలు ఏమి జరిగిందో అందరి కీ ఒక క్లారిటీ వచ్చింది. కంగన రనౌత్ దీనిపై స్పందించక పోయినా ఆమె అక్క రంగోళీ మాత్రం హృతిక్‌పై అభియోగాలు చేస్తూనే వుంది.


కానీ ఆమె కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ "రనౌత్‌-సిస్టర్స్‌" ఇందాకా తెచ్చుకుని పరువు పోగొట్టు కున్నారని తేలిపోయింది. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ కూడా హృతిక్‌ కే బాసటగా నిలిచింది. ప్రతిదానికి "ఫెమినిస్ట్‌ కార్డు" వాడుతోన్న కంగన రనౌత్ కి వారి వైపు నుంచి కూడా మద్దతు తగ్గిపోయింది. ఆమె ఆరోపణలకి ఆధారాలు లేకపోవడం, హృతిక్‌ మాటల్లో నిజాయతీతో పాటు, లాజిక్‌ కూడా వుండడంతో ప్రస్తుతానికి కంగన రనౌత్ దోషిగా కనిపిస్తోంది. ఆమె ఏదైనా అధారాలు  తీసుకొస్తే తప్ప ఈ "డర్టీ - ఇమేజ్‌" ఆమెని చాలా కాలం వెంటాడడం గ్యారెంటీ అనిపిస్తోంది.

 

ఆదిత్య పంచోళీ తో బెడిసి - పరువు నష్టం కేసులోబాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ పై కేసు నమోదు అయ్యింది. సీనియర్ నటుడు ఆదిత్య పంచోళీ, ఆయన భార్య జరీనా వహబ్‌, గత శుక్రవారం ముంబాయి "అంధేరీ కోర్టు" లో కంగనాపై పరువునష్టం దావా వేశారు. తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరిట అసత్య ఆరోపణలు చేస్తూ తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న కంగన రనౌత్‌ పై కేసు వేసినట్లు ఆదిత్య పంచోళీ,  ప్రకటించారు.




"కంగనా నాకు కొన్నేళ్లుగా తెలుసు. కానీ, ఈ మధ్య మీడియాలో ఆమె నా గురించి అభ్యంతరకర ప్రకటనలు చేస్తోంది. నాతో పాటు నా కుటుంబ సభ్యుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నా పరువును బజారు కీడుస్తోంది. నేను  ఆమెను హింసించానన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. వాటిని మౌనంగా భరించాల్సిన అవసరం నాకేంటి?  అందుకే ఆమెపై కేసు వేశాను" అని ఆయన చెప్పారు.


క్రిమినల్‌ కేసుతో పాటు మరో సివిల్‌ కేసు కూడా వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పంచోళీ,  ఆయన భార్య జరీనా వహబ్‌ తెలిపారు. కాగా, కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలీ పేరును కూడా ఈ దావాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.




సినిమా లోకి వచ్చిన కొత్తలో నటుడు ఆదిత్య పంచోళీ, ఆమెకు గాడ్‌ ఫాదర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే హృతిక్‌ రోషన్‌ తో అఫైర్‌ వ్యవహారం వెలుగులోకి రాగానే, ఆమెను దూరం పెట్టాడని బాలీవుడ్ వర్గాలు చెప్పు కుంటుంటాయి. ఈ నేపథ్యంలో పంచోలీ తనను దారుణంగా హింసించే వాడని కంగనా ఒక ఇంటర్వ్యూ లో చెప్పగా, వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండేదని ఆమె సోదరి రంగోలీ మరో బాంబు పేల్చింది. ఆయాప్రకటనలపై వారిద్దరికీ పంచోళీ, లీగల్‌ నోటీస్‌ పంపి నప్పటికీ, వారి తరపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన కేసు వేశారు. ఇప్పటికే బాలీవుడ్లో మద్దతుకరువై ఒంటరి అయిన ఆమె ఈ కేసును ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: