శ్రీదేవిపై ఫైర్ అవుతున్నారు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అందాల భామ శ్రీదేవి.  బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన  శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ చిత్రంతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.  అప్పటి నుంచి అలనాటి అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా ప్రతి ఒక్క హీరో సరసన నటించింది.  అంతే కాదు ఏఎన్ఆర్ తనయుడు నాగార్జున, వెంకటేష్, చిరంజీవి ల సరసన కూడా నలించింది ఈ అతిలోక సుందరి.  తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి విజయం సాధించిన శ్రీదేవిపై ఇప్పుడు తెలుగు అభిమానులు కోపంగా ఉన్నారు.  

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ, నటులకు మంచి జీవితాన్ని అందించిన గొప్ప దర్శకులు దాసరి నారాయణ రావు ఇటీవల కన్నుమూశారు.  ఆయనకు మరణ వార్త విని తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారే శోకసంద్రంలో మునిగిపోయింది.  పలువురు తమిళ, హిందీ,కన్నడ ఇండస్ట్రీ పెద్దలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.  కానీ దర్శకరత్న దాసరి నారాయణ రావు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి విజయాలు అందుకున్న శ్రీదేవి మాత్రం కనీసం కంటికి కూడా కనిపించలేదు.

పోనీ ఏవో కారణాల వల్ల కడసారి చూపులకు అందుకోక పోయినా..కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా సంతాపాన్ని వ్యక్తం చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాది నుండి వెళ్లి బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి , అయితే తెలుగు సినిమాలను పక్కన పెట్టింది బాలీవుడ్ లో జెండా పాతడంతో ఈ అమ్మడికి బాగా టెక్కు పెరిగిందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: