చెర్రితో నందమూరి హీరో ఢీ
యంగ్ హీరో కళ్యాణ్ రామ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఢీ అంటున్నాడు. చెర్రితో తాడో పేడో బాక్సాఫీస్ దగ్గర తేల్చుకుందాం రా అంటున్నాడు. అదేంటి సడన్ గా నందమూరి హీరో మెగా పవర్ స్టార్ తో ఢీ ఎందుకు అంటున్నాడు. ఇద్దరికీ తేడా ఎక్కడ వచ్చింది అంటారా?
అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఓం అనే త్రిడి ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఇండియాలోనే ఫస్ట్ టైం వస్తోన్న యాక్షన్ త్రిడి ఫిల్మ్ ఇది. అందుకే హీరోకి ప్లాప్స్ వున్నా సినిమాపై కొంచెం అంచనాలు వున్నట్టుగానే కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఓం ఈ నెల 27న విడుదల అవాల్సి వుంది. కానీ ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త పెండింగ్ వుండటంతో ఓం రిలీజ్ జూలైకి ఫోస్ట్ పోన్ అయింది. మరి జూలైలో పెద్ద సినిమాల రిలీజేస్ చాలా వున్నవికదా..? అసలే భారీ బడ్జెట్ ..తేడా వస్తే అదోగతేకదా అంటే హీరో కళ్యాణ్ రామ్ మాత్రం ఓంపై నాకు నమ్మకం వుంది. నా సినిమాకు ఎవడు ఎదురొచ్చినా నిలవడం కష్టమే అంటున్నాడట. అనడమే కాదు ఎవడు రిలీజ్ కి దగ్గర గా జూలై 19న ఓంని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేశాడట.
ఇక వంశీపైడి పల్లి డైరెక్షన్ లో చెర్రి నటించిన ఎవడు ఈ నెల 30న ఆడియో, వచ్చె నెల 25న మూవీ రిలీజ్ కానుంది. శృతిహాసన్, అమీజాక్సన్ లాంటి గ్లామర్ డాల్స్, అల్లు అర్జున్ , కాజల్ గెస్ట్ రోల్స్ తో ఎవడుపై ఇటు ఇండస్ట్రీ, అటు అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. మరి ఇన్ని అంచనాల మద్య వస్తోన్న ఎవడుకి పోటీగా కళ్యాణ్ రామ్ నిలవగలడా......? ఎవడుకి వారం రోజుల ముందు రిలీజ్ చేస్తే దిల్ రాజు ధియేటర్స్ లాగేసుకోకుండా వుంటాడా...? తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ..