రాజుగారి గది ఇప్పటికే మూడు సిరీస్ కంప్లీట్ చేసుకొని,విడుదలకు రెడీగా ఉంది రాజు గారి గది3. అయితే త్వరలోనే నెక్స్ట్ సిరీస్ ఉండబోతుందని హింట్ ఇచిన్నటే ఇచ్చారు దర్శకులు మరియు నిర్మాత ఓంకార్. ఈ సిరీస్లో నాలుగో భాగంగా తెరకెక్కనున్న సినిమాకి వెంకటేష్ హీరోగా నటించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలతో ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు, మరియు నిర్మాత ఓంకార్.మొన్న తాజాగా జరిగిన మూవీ ప్రమోషన్స్ లో మీడియా ముందు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు ఓంకార్.
రాజుగాది గది 3 సినిమా రీమేక్ అని క్లారిటీ ఇచ్చారు ఓంకార్. సంతానం హీరోగా,తమిళ్లో ఘన విజయం సాధించిన దిల్లుకు దుడ్డు 2 సినిమా లోని ముఖ్యమయిన అంశాన్ని తీసుకొని,మన తెలుగు నేటివిటీకి తగినట్టు కథ లో పలు మార్పులు చేసి, సిద్ధం చేసారని చెప్పారు.ఓంకార్ స్వయంగా నిర్మించి,దర్శకత్వం వహించిన సినిమా రాజు గారి గది త్రీ. ఈ సినిమాలో హీరోగా అశ్విన్ బాబు,హీరోయిన్ గా అవికా గోర్ నటించారు.ఈ సిరీస్లో వచ్చిన గతచిత్రాలతో పోల్చి చూస్తే,ఈ మూవీలో కామెడీ అంశం మరింతగా అలరిస్తుంది అని,చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఓంకార్. ఇంకా ఈ మూవీలో సీనియర్ నటులు అయిన అలీ, ఉర్వశీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అని వెల్లడించారు ఓంకార్.
నాగార్జున హీరోగా,ముఖ్యమయిన పాత్రలో సమంత చేసిన రాజుగారి గది 2కు సినీజనాలు నుండి మంచి టాక్ వచ్చినా,కమర్షియల్గా ఊహించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో, రాజుగారి గది 3 విషయంలో,మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాజుగారి గది 2లో ఎంటర్టైన్మెంట్ అసలు లేదని టాక్ రావటంతో, ఈ సినిమాని మంచి ఎంటర్టైనింగ్గా రూపొందించారని ఓంకార్ పేర్కొన్నారు.
అంతేకాకుండా తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా, నిలబెట్టడం అన్నగా తన బాధ్యత అని,దానికోసం తాను ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించామని వెల్లడించారు. నాలుగు నెలలోనే సినిమాను పూర్తి అయింది అని,దీనికి సహకరించిన చిత్ర యూనిట్ సభ్యులు అందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేసారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజుగారి గది 3 ఆడియన్స్ను ఎంతవరుకు మెపిస్తుందో వేచి చూడాల్సిందే..