ఏపీ సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప, పుష్ప 2 చిత్రాలతో విజయాలు అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పైన ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరి కొంతమంది హీరోయిన్స్ నటించబోతున్నారు. ఇక మరొక సినిమా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నట్టు సమాచారం.


ఇటీవల అల్లు అర్జున్ ఇంట్లో తన సోదరుడు అల్లు శిరీష్, నైనిక రెడ్డి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు అల్లు కుటుంబంతో పాటుగా మెగా కుటుంబ సభ్యులు పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయవేత్తలు కూడా హాజరయ్యి ఈ జంటను ఆశీర్వదించారు. తాజాగా అల్లు అర్జున్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ఇలా షేర్ చేస్తూ.. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు శిరీష్,నయనికాను ఆశీర్వదించడానికి, మా ఫ్యామిలీకి మీ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ఇంటికి వ్యక్తిగతంగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చేసినందుకు మీ ఆప్యాయత ఆశీర్వాదాలకు మేము నిజంగా కృతజ్ఞతలు అయ్యాము, అయితే క్షమించండి ఆ సమయంలో నేను విదేశాలలో ఉన్నాను మీతో ఫోన్లో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: