"రంగస్థలం 2"లో షాకింగ్ ఛేంజెస్..! హీరో, హీరోయిన్ మాత్రమే కాదు.. ఆమె క్యారెక్టర్ కూడా రిప్లేస్..!
ఇప్పటికే ఇండస్ట్రీలో బజ్ ఏమిటంటే — ఈ ప్రాజెక్ట్ హీరోగా ప్రభాస్ లేదా ఎన్టీఆర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో ఇంకా స్పష్టత లేదు కానీ, ఈ రెండింట్లో ఎవరు చేసినా “రంగస్థలం 2” మరింత భారీ స్థాయిలో ఉండడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. మరియు హీరోయిన్ విషయంలో కూడా పెద్ద మార్పు జరిగిందట. “రంగస్థలం”లో రామలక్ష్మి పాత్రతో సమంత ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ పాత్రకు మరోసారి ఆమెనే రిపీట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈసారి దర్శకుడు సుకుమార్ కొత్త ఫ్రెష్ ఫేస్ను ఎంపిక చేశాడట. ఈ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమె పాన్ ఇండియా ఇమేజ్, నటన స్కోప్ దృష్ట్యా ఈ పాత్రకు కృతి సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయంతో ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇంతటితో మార్పులు ఆగలేదు..! మొదటి పార్ట్లో "రంగత్తమ్మ" పాత్రతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన అనసూయ భరద్వాజ్ స్థానంలో ఈసారి మరో హీరోయిన్ను తీసుకున్నారని వినికిడి. ఈ సారి ఆ క్యారెక్టర్ను పోషించేది టాలెంటెడ్ యాక్ట్రెస్ "లయ" అని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకొచ్చిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు — ఎందుకంటే రంగత్తమ్మ పాత్ర ‘రంగస్థలం’లో కీలక ఎమోషనల్ సపోర్ట్గా నిలిచింది కాబట్టి, లయ ఆ ఇమేజ్కి సరిపోతుందా అన్న చర్చ మొదలైంది.
సుకుమార్ మాత్రం ఈ సారి మరింత రియలిస్టిక్, ఎమోషనల్గా సినిమాను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడట. “రంగస్థలం 2”లో గ్రామీణ నేపథ్యం కొనసాగించడంతో పాటు, రాజకీయ అజెండా, సామాజిక మార్పులు, మరియు కొత్త తరహా మానవ సంబంధాలను ప్రధాన థీమ్గా ఎంచుకున్నారని టాక్.ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉందట. హీరో కాస్టింగ్ ఫైనల్ అయిన వెంటనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మించే అవకాశముందని కూడా ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.మొత్తానికి, “రంగస్థలం 2”లో హీరో, హీరోయిన్ మాత్రమే కాదు… ‘రంగత్తమ్మ’ పాత్ర కూడా కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కాంబినేషన్పై సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.