నందమూరి బాలకృష్ణ అనే పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన ప్రత్యేకమైన మాస్ ఎలిమెంట్స్, తొడ కొట్టడాలు, డైలాగులు, స్టైల్. ఆయన తొడ కొడితే రైలు ఆగిపోతుంది, కళ్లతో చూస్తే శత్రువులు కంపించిపోతారు అనే సన్నివేశాలు మనం ఎన్నోసార్లు సినిమాల్లో చూసాం. ముఖ్యంగా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి సినిమాలు ఆయన కెరీర్లో ఒక మైలురాయిలుగా నిలిచిపోయాయి.
ఇవి ఆయనకు బాగా సూట్ అవుతాయని, బాలయ్య అంటే మాస్ సినిమాలకు పర్ఫెక్ట్ హీరో అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే కేవలం మాస్ యాక్షన్ సినిమాలే కాదు, క్లాస్ టచ్ ఉన్న సినిమాలలో కూడా బాలయ్య మంచి విజయాలు సాధించారు. అదిత్య 369లో కృష్ణదేవరాయల పాత్ర కానీ, గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతకర్ణి పాత్ర కానీ ఆయన కెరీర్లో స్పెషల్గా నిలిచిపోయాయి. ఇవి బాలయ్య గారికి వ్యక్తిగతంగానూ చాలా ఇష్టమైన పాత్రలు. ఆయన అనేక ఇంటర్వ్యూలలో కూడా పౌరాణిక గెటప్లు, చారిత్రక పాత్రలు చేయడం తనకు ఎంత ఇష్టమో బహిరంగంగానే చెప్పేశారు.
కానీ గత కొంతకాలంగా అలాంటి పాత్రలు ఆయనకు రాలేదు. ఎక్కువగా ఫ్యాక్షన్ లేదా యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్గా ఉన్నా, డివోషనల్ టచ్తో వచ్చిన అఖండ సినిమాలోని అఘోర పాత్ర మాత్రమే ప్రత్యేకంగా నిలిచింది. కానీ మహారాజు గెటప్లో కనిపించే పాత్ర మాత్రం ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ఇక తాజాగా ఈ కోరికను దర్శకుడు గోపీచంద్ మలినేని నిజం చేయబోతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. నిర్మాత సతీష్ కిలారు నిర్మాణంలో బాలయ్య ఒక భారీ చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో గాసిప్ హాట్గా మారింది. ఈ సినిమాను బాలయ్య కెరీర్లోనే అత్యంత హైలైట్గా నిలిపేలా మేకర్స్ పకడ్బందీ ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో బాలయ్య చారిత్రక గెటప్లో కనిపించబోతారని, అందుకు తగ్గట్లుగా సినిమా కోసం రియల్ కోటలలో షూటింగ్ చేయాలని టీమ్ డిసైడ్ చేసిందట. సెట్ వేసి కృత్రిమంగా చేయడం కన్నా రియల్ లొకేషన్లో షూట్ చేస్తే సినిమా లుక్స్ అద్భుతంగా వస్తాయని, ఆ ఫీల్ కూడా ప్రేక్షకులకు రియలిస్టిక్గా అనిపిస్తుందని డైరెక్టర్ గోపీచంద్ భావిస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత కోటలను వెతికేస్తున్నారని టాక్.ఇటీవల బాలయ్య, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి కోసం కూడా కొన్ని కోట్లలో రియల్ కోటలలో షూట్ చేసిన సంగతి తెలిసిందే.
అదే విధంగా ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా అలాంటి రియల్ లొకేషన్ల కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే టీమ్ మిరజ్ వైపు కూడా వెళ్లి వచ్చిందని సమాచారం. అన్నీ సెట్ అవ్వగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బాలయ్య చారిత్రక గెటప్లో మరోసారి కనిపించబోతున్నారన్న వార్త వినగానే అభిమానులు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే అలాంటి పాత్రలు బాలయ్యకు సహజంగానే బాగా సూట్ అవుతాయి. పైగా ఆయనకు కూడా ఇవి వ్యక్తిగతంగా ఇష్టమైన పాత్రలు కావడంతో, ఈ సినిమా ఆయన కెరీర్లోనే ఒక మాస్టర్పీస్గా నిలిచిపోతుందనే నమ్మకం ఫ్యాన్స్లో పెరుగుతోంది.