అతడు : రీ రిలీజ్ లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన అనేక సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు హీరో గా నటించిన సినిమాలు ఎన్నో ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి రీ రిలీజ్ లో భాగంగా ఎన్నో కొత్త కొత్త రికార్డులను సృష్టించాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా రూపొందిన అతడు మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే అతడు మూవీ రీ రిలీజ్ లో భాగంగా టోటల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి అతడు మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో 2.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 45 లక్షలు , ఆంధ్ర లో 1.90 కోట్లు , కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు , ఓవర్సీస్ లో 1.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ లో భాగంగా అతడు మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఇలా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా త్రిష హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో మహేష్ , త్రిష జోడీ కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల , విమర్శకుల నుండి  దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb

సంబంధిత వార్తలు: