పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ .. అప్పటివరకు భద్ర , సింహా , బృందావనం వంటి సూపర్ హిట్ సినిమాల కి రైటర్ గా వర్క్ చేశాడు .. ఇక మిర్చి మంచి కమర్షియల్ గా హిట్ అయింది .. రొటీన్ కథ అయినప్పటికీ దానికి కొరటాల ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రభాస్ ను అతను చూపించిన తీరు అభిమానులనే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది .. ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చాడు . ఇక వీరి కాంబినేషన్ గా వచ్చిన శ్రీమంతుడు , భరత్ అనే నేను రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి .
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్, దేవర కూడా ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టుగా కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాయి ..
ఇక కొరటాల కెరియర్లో అతిపెద్ద రిమార్క్ అంటే ఆచార్య సినిమానే చెప్పాలి .. అత్యంత దారుణంగా ప్లాప్ అయ్యింది .. ఈ సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలు ఒకటి రెండు కూడా అసలు ఉండవు. అయితే ఇప్పుడు అలా అని దేవర కూడా సూపర్ హిట్ సినిమా అని చెప్పలేం .. సినిమాకు వచ్చిన కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే కంటెంట్ పరంగా ఈ సినిమా కూడా ఆడియన్స్ ని పూర్తిస్థాయిలో అసలు ఆకట్టుకోలేదు .. అయితే ఇప్పుడు దీన్ని రెండో భాగం కూడా ఉంటుందని కూడా ప్రకటించారు ..
అయితే ఇది ఇప్పట్లో రావడం కష్టమే ..! మరోపక్క టాలీవుడ్ లో కొరటాల శివతో పని చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ సరిగ్గా ఆసక్తి చూపించడం లేదు .. దీంతో ఈ దర్శకుడు ఓ బాలీవుడ్ హీరోని లైన్లో పెట్టినట్టు ఇన్సైడ్ టాక్ . ఎస్ కొరటాల త్వరలోనే ఓ బాలీవుడ్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడు . ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు రణబీర్ కపూర్ . ఇటీవల రణబీర్ కపూర్ ని కలిసిన కొరటాల ఓ కథ చెప్పడం దానికి రణబీర్ ఓకే చెప్పటం అన్ని చకచక జరిగిపోయాయి .. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపికైనట్లు కూడా టాప్ వినిపిస్తుంది . అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఏదేమైనా ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎవరు బహుశా ఎప్పుడు ఊహించి ఉండరు ..