బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో 'ఈ రోజే నేను ఛావా సినిమాను చూశాను. ధైర్యం, నిస్వార్ధం, తన పనిపై అంకితభావం.. ఇలా ఎన్నో గొప్ప విషయాలు కలిగి ఉన్న గొప్ప కథ ఇది. కానీ నేను నిజాయితీగా ఒక ప్రశ్న వేయాలి అనుకుంటున్నా. ఇంత గొప్ప వ్యక్తి అయిన ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి పాఠశాలలో ఎందుకు పెట్టలేదు.. ఎందుకు నేర్పించలేదు. ఆయన గురించి ఎందుకు అసలు ఏ ఒక్క పుస్తకంలో కూడా ప్రస్తావన లేదు' అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు.
ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేశారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీత అందించారు. ఈ సినిమాతో వీరిద్దరూ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్గా విడుదల అయ్యింది. రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. కానీ సినిమాలో రష్మిక ఎంత అద్బుతంగా నటించినప్పటికి విక్కీ కౌశల్ ని బీట్ చేయలేక పోయింది.
విక్కీ, శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించేశాడని చాలా మంది అన్నారు. విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడాని.. నిజంగా శంభాజీ మహరాజ్ ఉండి ఉంటే ఇలా ఉండేవాడా అని అనుకునేల విక్కీ నటించడాని టాక్ వినిపించింది. ఈ సినిమా కోసం విక్కీ శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు.