గట్టిగా ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. రాజమౌళిని మించి పోయేలా ఉన్నాడే?

praveen

త్రివిక్రమ్ - రాజమౌళి గురించి తెలుగు జనాలకు చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఉన్న టాప్ దర్శకులలో వీరు మొదటి వరుసలోకి వస్తారు. ఒకరు వందల కోట్లతో బడా సినిమాలను తెరకెక్కిస్తే, మరొకరు పదుల కోట్లలోనే రక్తికట్టించే ఫామిలీ డ్రామాలను తెరకెక్కిస్తారు. అందుకే హీరోలతో పాటుగా వీరికంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఇక్కడ ఉంటుంది. అందుకే వీరి డేట్స్ కోసం నిర్మాతలు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇక రాజమౌళి గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, rrr సినిమాలతో విజువల్ వండర్స్ చేయాలంటే జక్కన్న తప్పితే వేరొకరు లేరని ఓ మార్క్ క్రియేట్ చేసాడు రాజమౌళి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా జక్కన్నను తలదన్నే సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును, అల్లు అర్జున్ హీరోగా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి విదితమే. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంపై ఇప్పటికే 1000 కోట్లకి పైగా బిజినెస్ జరిగిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దాంతో ఇండియాలోనే హైయెస్ట్ థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ జరిగిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డుల్లోకి ఎక్కింది. సినిమా విడుదల సమీపించడంతో తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ మూవీ చేయబోతున్నాడని, ఆ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కించనున్నారు అంటూ చెప్పుకొచ్చారు సదరు నిర్మాత.
సదరు ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోయే సినిమాపై ఓ హింట్ కూడా ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు అయితే భుజాలు గజాలు చేసుకొని గుద్దుకుంటున్నారు. విషయం ఏమిటంటే... ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అన్నాడు. రాజమౌళి మూవీస్ ని మించేలా ఆ చిత్రం ఉంటుందని సదరు నిర్మాత చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పారు. ఈ మాటలతో ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్, బన్నీ కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: