నందమూరి కుటుంబాన్ని అవమానించిన అలేఖ్య రెడ్డి ?

Veldandi Saikiran

హీరో నందమూరి తారకరత్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై అకస్మాత్తుగా మరణించాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న మరణించడం జరిగింది. తారకరత్న మరణంతో తన పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులు తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ హీరో అతి చిన్న వయసులోనే మరణించడం నిజంగా చాలా బాధాకరం. తారకరత్న మరణించి సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారి వ్యక్తిగత విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అలేఖ్య రెడ్డి పంచుకోవడం విశేషం. ఇదిలా ఉండగా.... తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తన పెద్ద కుమార్తె నిష్మ హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది.

వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా ఈ వేడుకలో తారకరత్న ఫోటోకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని అలేఖ్య చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి అలేఖ్య రెడ్డి తరఫున బంధువులు అందరూ హాజరయ్యారు కానీ నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ వేడుకకు హాజరు కాకపోవడం బాధాకరం. ఈ విషయం తెలిసి చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

అలేఖ్య రెడ్డి తన కూతురు హాఫ్ సారీ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవలేదు కావచ్చు అందుకే నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ వేడుకకు రాలేదని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. తారకరత్న మరణించిన తర్వాత వీరికి ఏవో గొడవలు జరిగాయని, అందుకే అలేఖ్య నందమూరి కుటుంబాన్ని హాఫ్ సారీ వేడుకకు పిలవలేదని అంటున్నారు. ఏది ఏమైనా అలేఖ్య రెడ్డి ఈ ఫంక్షన్ కి నందమూరి కుటుంబాన్ని పిలిస్తే బాగుండేది ఇలా వారిని పిలవకుండా అలేఖ్య రెడ్డి నందమూరి కుటుంబాన్ని అవమానించిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: