ప్రభాస్ 'రాజాసాబ్' స్టోరీ ఇదేనా.. డార్లింగ్ ఈసారి భయపెట్టబోతున్నాడట?

praveen
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరో స్టార్ డం అనుభవిస్తున్న డార్లింగ్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన 'రాజా సాబ్' మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ గురించే ప్రతిచోటా చర్చ నడుస్తోంది. నిన్న విడుదలైన ఈ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటోంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ని ముసలి రాజు గెటప్ లో చూసి రెబల్ ఫ్యాన్స్ అయితే థ్రిల్ అయిపోతున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, ప్రభాస్ దెయ్యం క్యారక్టర్ కూడా చేస్తున్నట్టు ఈ మోషన్ పోస్టర్ ని చూసిన వారికి ఇట్టే అర్ధం అయిపోతుంది.
ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హారర్ థ్రిల్లర్ జానర్లో చేయడం ఇపుడు క పెద్ద సర్ప్రైజ్ అయితే, మళ్ళీ ఆయన దెయ్యం క్యారక్టర్లో కూడా కనిపించడం మరో బిగ్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మారుతీ హారర్ జానర్లో చాలా కొత్తగా అలోచించి సినిమాలను తీస్తాడనే విషయం అందరికీ తెలిసినదే. వాస్తవానికి హారర్ కామెడీ జానర్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది కూడా మారుతి అనే చెప్పుకోవాలి. ఆయన స్టోరీ అందించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ ట్రెండ్ ఊపు అందుకుంది. అలా ‘రాజా సాబ్’ చిత్రం కూడా ‘హారర్’ జానర్ లో ఇప్పటి వరకు ఆడియన్స్ చూడని కోణాన్ని పరిచయం చేయబోతున్నాడని టాక్ వినబడుతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అని సోషల్ మీడియాలో కలకలం రేగుతోంది. కథలోకి వెళితే... "మధ్యతరగతి కుటుంబంలో అందరి లాగానే కష్టాలు పడుతున్న ఒక కుర్రాడికి ధనవంతుడిగా బ్రతకాలి, రాజా లాగ లగ్జరీ లైఫ్ ని అనుభవించాలి అనే కోరికలు కలుగుతాయి. అలా బ్రతికేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఈ క్రమంలో ఆయనకీ తన తాత గారికి సంబంధించిన ఆస్తులు తన సొంత ఊరిలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ ఊరిలో తన తాత గారు నివసించే రాజ్ మహల్ లాంటి ఇల్లు, అలాగే ఆయన దాచిపెట్టిన నగలు, డబ్బులతో కూడిన బోలెడంత నిధి ఉందని, ఆ ఆస్తి మొత్తానికి అతనే వారసుడు! అనే విషయాన్ని తెలుసుకొని, ఆ ఇంటికి వెళ్లి అక్కడ తన తాత ఆత్మతో పోరాడి, ఒప్పించి ఎలా ఆస్తిని దక్కించుకుంటాడు!" అనేదే స్టోరీ అని జనాలు రాస్తున్నారు. మరి ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పండి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: