ఆ కారణంగానే సినిమాలు మానేశాను ప్ర‌భ‌స్‌ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి గొప్ప న‌టులు అవ్వాలని చాలా మంది హీరోలు , హీరోయిన్లు ఆశపడుతూ ఉంటారు . కానీ అది అందరికీ కలిసి రాదు .. కొంత మంది మాత్రమే స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ కోవలోకే వస్తుంది నాగార్జున మన్మధుడు సినిమాలో నటించిన అన్షు అంబానీ ఈమె గురించి పరిచయం అక్కర్లేదు .. ఈమె పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గర అయింది.. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన రాఘవేంద్ర సినిమాలో కూడా అన్షు నటించింది. అలాగే కోలావుడ్‌లో కూడా జై  సినిమాలో నటించి  ఇలా తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించింది అన్షు.

ప్రస్తుతం ఈమె తన కుటుంబంతో సినిమాల‌ కు దూరంగా లండన్ లో ఉంటుంది.. అయితే ఎప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్ళీ ఆమె పేరు వైరల్ గా మారింది. దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అన్షు కనిపించే సరికి అభిమానులందరూ షాక్ అయ్యారు.. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు .

అవకాశాలు వస్తున్న సమయంలో ఆమె చదువుల కోసం లండన్ వెళ్లిపోయింది.. అక్కడే వ్యాపార వార్త సచిన్ ని పెళ్లి చేసుకుని లండన్ లో స్థిరపడింది. ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది అయితే ఆమె త్వరలో మళ్లీ ఇండస్ట్రీలోకి రాబోతుందని కూడా అంటున్నారు.  ఏదైనా క్రేజీ ప్రాజెక్టులలో నటించచ్చని టాక్. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె సినిమాలని వదిలేసింది. ఎందుకు వదిలేసింది అనే ప్రశ్నకి తాజా గా ఒక ఇంటర్వ్యూలో ఆమె సమాధానం చెప్పారు.. కెరియర్ మొద‌టిలో తాను చేసిన పాత్రలన్నీ సెకండ్ హీరోయిన్‌నే కావడంతో వాటితో విసికొచ్చి సినిమాలని వదిలేసి వెళ్ళిపోయిందిట.. దానికంటే సినిమాలు చేయకుండా ఖాళీ గా ఉండటమే నయమని ఆమె భావించారట .. ఇక‌ అందుకనే ఇండస్ట్రీని విడిచిపెట్టి అన్షు దూరంగా ఉండిపోయిందట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: