దేశంలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు.. ఈమె ఆస్తులు విలువ ఎంతంటే..?

Divya
ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు సినిమాలలో తక్కువ పారితోషకము లభిస్తున్న నేపథ్యంలో ఇతర విషయాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కొంతమంది యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటే,  మరికొంతమంది వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ డబ్బు పోగేసుకుంటున్నారు. మరికొంతమంది హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటున్నారు.  ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ దేశంలోనే అత్యంత ధనవంతురాలిగా పేరు సొంతం చేసుకుంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
దేశంలో అత్యంత సంపన్న కథానాయికగా నిలిచింది. ఆమె ఎవరో కాదు జూహీ చావ్లా. ఈమె మాధురి దీక్షిత్,  కరిష్మా కపూర్ల కంటే సీనియర్ కూడా.. అగ్ర కథానాయికగా సినీ పరిశ్రమను ఏలిన ఈమె హిందీతో పాటు తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో కూడా నటించింది. తెలుగు చిత్రసీమలో జూహీ చావ్లా విక్కీ దాదా చిత్రంలో నాగార్జున సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ రూ.7,300 కోట్ల ఆస్తులతో నంబర్ వన్ స్థానంలో నిలవగా జూహీ చావ్లా రూ.4,600 కోట్ల నికర ఆస్తి విలువతో రెండవ స్థానంలో నిలిచింది.
1990 లలో హిందీ పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈమె, ఖయామత్ సే ఖయామత్ తక్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు వరుస చిత్రాలతో బాక్సాఫీస్ శాసించిన ఈమె 2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా మారిపోయింది.  అప్పుడప్పుడు సహాయక పాత్రలో కనిపించిన ఈమె రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తోంది. ఇక అంతే కాదు తన స్నేహితుడైన షారుక్ ఖాన్ తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థకి సహ వ్యవస్థాపకురాలు కూడా జూహీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్  కోల్ కతా నైట్ రైడర్స్ ని కూడా నిర్వహిస్తోంది.  అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టిన ఈమె ఈ విధంగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: