పవన్ కోసం రేణు దేశయ్.. ఇంత‌ పెద్ద త్యాగం చేసిందా చివరకు మిగిలింది ఇదే..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం.. అలాంటి పవన్ తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో పవర్ స్టార్ గా చెరిగిపోని గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య  రేణుదేశయ్‌ కూడా అందరికీ తెలుసు.. మహారాష్ట్రలో ఓ మరాఠీ కుటుంబంలో పుట్టారు రేణుదేశయ్ .. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో హీరోయిన్గా తమిళ ఛత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.. పార్వతీభన్ జేమ్స్ పాండు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలానే పూరి జగన్నాథ్ బద్రి మూవీ కోసం హీరోయిన్స్ ని చూడటం మొదలుపెట్టారు ఇద్దరు హీరోయిన్స్ కావాలి..

మొదటి హీరోయిన్గా అమీషా పటేల్ ని కన్ఫర్మ్ చేశారు.. ఇక సెకండ్ హీరోయిన్ గా రేణు దేశాయ్‌ని ఎంచుకున్నారు.. బద్రి మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. పవన్ ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రేణు దేశయ్‌తో ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరి మధ్య సహజీవనం కూడా మొదలైంది 2000 లోని ఈ మూవీ విడుదలైంది తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ ఏర్పడిందని టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. టాలీవుడ్లో నటించిన తొలి సినిమాతోనే ఆమె సినిమాలకు దూరమైంది.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే ఆమె సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది .. కేవలం ప్రేమలో ఉందన్న కారణంతో సినిమాల్లో నటించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. 2003లో జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారారు హీరోయిన్గా రేణు దేశాయ్ నటించిన అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే చేసింది. నిజానికి ఆమె తలుచుకుంటే అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించేది. బద్రి మూవీ కంప్లీట్ అవ్వగానే ఆమెకు మురారి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆమెకు స్టోరీ కూడా బాగా నచ్చింది.. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆమె పక్కన పెట్టేసింది.. తన భర్త తప్ప ఇంకో ప్రపంచం అక్కర్లేదని అనుకుంది . ఇలా మురారి సినిమాలో నటించే అవకాశాన్ని చేతులారా వదులుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: