రోజుకి 9 ఆటలతో టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డు గా నిలిచిన చిరు మూవీ.. ఆ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కే గాడ్ ఫాదర్గా నిలిచారు. తన 40 సంవత్సరాల సినీ కెరియర్ లో 150 కు పైగా సినిమాలు నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఇప్పటికీ తన నటనతో  నేటితరం హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు.అలాంటి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌కు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమాల్లో ముఠామేస్త్రి కూడా ఒకటి..

చిరంజీవి అభిమానులకి, మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది.. ముఠామేస్త్రి మూవీ పూనకాలు తెప్పిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఘరానా మొగుడు సినిమా తర్వాత, ఆపద్బాంధవుడు సినిమాలు నటించారు చిరు.. కోదండరామిరెడ్డి చిరు కాంబినేషన్లో ఆఖరి సినిమా ముఠామేస్త్రి ఇందులో రోజా , మీన హీరోయిన్లుగా నటించారు. బడ్జెట్ భారీగా అవుతుందని ఇంకో నిర్మాతను కూడా లైన్లో పెట్టుకున్నారు. అలా చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ముఠామేస్త్రి సినిమా స్టార్ట్ అయింది.

అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరు రాజకీయాల్లోకి వస్తున్నారు అందుకనే ముఠామేస్త్రి సినిమా చేస్తున్నారని రూమర్లు కూడా వచ్చాయి. అలానే ఈ సినిమా సెన్సార్ పనులు కారణంగా విడుదల వాయిదా పడితూ వచ్చింది. ఇలా ఎట్టకేలకు సినిమా వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ చిరంజీవి నటన కానీ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాని ఎన్నిసార్లైనా చూడొచ్చు అన్న భావన అందరికీ కలిగింది పెద్ద హిట్ ని అందుకుంది. టాలీవుడ్లో వన్ అఫ్ ది మోస్ట్ బెస్ట్ మసాలా మూవీ గా నిలిచిపోయింది ముఠామేస్త్రి. 200 థియేటర్లలో ఈ సినిమాని వేశారు అయితే మొదటి రోజు కాకినాడ దేవి థియేటర్ లో తొమ్మిది షోలు వేశారు. మొదటివారం కోటిన్నర షేర్ లని కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డ్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: