పవన్ - శంకర్ కాంబినేషన్ 2సార్లు మిస్ అయిందా.. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా?

praveen

చలనచిత్ర పరిశ్రమలో హీరోలు టాప్ డైరెక్టర్లతో కలిసి సినిమా చేయాలని కోరుకోవడం సహజం. అయితే ఇండియాలో డైరెక్టర్ శంకర్ తో కలిసి సినిమా చేయాలని చాలామంది అనుకుంటారు. 30 ఏళ్ల కిందే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, భారతీయుడు, రోబో వంటి సినిమాలతో ఈ దర్శకుడు ఇండియా వైట్ గా సూపర్ పాపులర్ అయ్యాడు. అడ్వాన్స్‌డ్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించేవాడు. టెక్నాలజీ కూడా బాగా వాడేసేవాడు. శంకర్ మేకింగ్ స్టైల్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలామంది కోరుకునేవారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ దర్శకుడితో ఏదో ఒక సినిమా తీయాలని అనుకునే ఉంటాడు. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తోనే శంకర్ రెండుసార్లు ఈ దర్శకుడితో కలిసి సినిమా చేయాలనుకున్నారు కానీ రెండుసార్లూ అది సాధ్యం కాలేదు. గతంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కలిసి ‘3 ఇడియట్స్’ సినిమా చేశారు. అది పెద్ద హిట్టు. ఇది అన్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసి వావ్ అనిపించింది. ఆరోజుల్లో 500 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే, మాటలు కాదు. ద్రవ్యోల్బణంతో అడ్జస్ట్ చేసి చూస్తే కొలిచి ఇప్పుడు ఆ 500 కోట్లు రూ.2,000 కోట్లకు సమానమని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ శంకర్ కి ఈ సినిమా బాగా నచ్చింది. అందుకే దాన్ని రీమేక్ చేయాలనుకున్నాడు.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబును సెలెక్ట్ చేసుకున్నాడు కానీ మహేష్ రీమేక్ సినిమాలు తను చేయనని చెప్పేశాడు. శంకర్ లాంటి డైరెక్టర్ అడిగినా మహేష్ రీమేక్‌లు చేయకూడదని తాను పెట్టుకున్న ఆ రూల్ అతిక్రమించలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అది రీమేక్ కావడం వల్ల భయపడ్డారు. అమీర్ ఖాన్ యాక్టింగ్ చూశాక మరింత వణికిపోయాడు. తాను ఆ సినిమా చేస్తే ఇద్దరినీ కంపేర్ చేస్తారని అప్పుడు అంత గొప్ప నటుడి ముందు తను తేలిపోతానని సున్నితంగా చెప్పేసి దీని నుంచి తప్పుకున్నాడు.
దాంతో శంకర్ తమిళ సూపర్ స్టార్ విజయ్ ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఫలితంగా మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తే అది బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ పవన్ కోసమే ఆయన రాసుకున్నాడట. నిర్మాత దిల్ రాజుతో కూడా అదే విషయాన్ని చెప్పాడట. అయితే దిల్ రాజు, ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి సరిపోతుందని చెప్పాడట. దాంతో రామ్ చరణ్ నే ఫైనల్ చేశారు. ఈ విధంగా వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్ అయ్యాయి. భవిష్యత్తులో వీరు కలిసి కొలాబరేట్ అవుతారో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: