ఏంటి గురు.. ఈ ముద్దుగుమ్మ డాక్టరా.. టాలీవుడ్ లో తన అందంతో పిచ్చెక్కించిందిగా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యామని చెబుతూ ఉంటారు. మరికొందరు మాత్రం మరోపక్క ఎంబిబిఎస్ చదువుతూనే హీరోయిన్గా కొనసాగుతారు. అందం, అభినయం, నటనతో వెండితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, ఐశ్వర్య లక్ష్మి, శ్రీ లీల, ఆశిక రంగనాథ్ వంటి హీరోయిన్లు డాక్టర్లుగా చేస్తున్న వారే. అయితే కానీ ఓ తెలుగమ్మాయి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను తెచ్చుకుంటున్న హీరోయిన్ కూడా డాక్ట‌రే.. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసి నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి ఈ అమ్మాయి డాక్ట‌రా అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరు.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల..  టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లో ఈమే కూడా ఒకరు.  సాయి కామాక్షి భాస్కర్ల అచ్చ‌ తెలుగమ్మాయి.. చెన్నైలో ఎంబిబిఎస్ పూర్తి చేసి అపోలో డాక్టర్ గా కొన్నాళ్లుగా పనిచేసింది. అలాగే 2018 లో మిస్ తెలంగాణ గా కూడా గెలిచింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ప్రియురాలు అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది. ఇక ఆ తర్వాత పొలిమేరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం బీమ్ బుష్ వంటి సినిమాలో నటించి అదరగొట్టింది.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ విభిన్న హీరోయిన్ గా క్రేజ్‌ తెచ్చుకుంది. నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది సాయి కామాక్షి. ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ లో కూడా అలరించింది. ఈ అమ్మడు ఎక్కువగా ఢీగ్లామర్ రోల్స్ చేసింది. కానీ నెట్టింట మాత్రం అందుకు విభిన్నం. గ్లామర్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: