ఒక్క సినిమా నష్టాన్ని పూడ్చడానికి నితిన్ అన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తోనే నితిన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఈయన మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక కొన్ని సంవత్సరాల పాటు నితిన్ విజయాలు లేకుండా కెరియర్ లో కొనసాగించాడు. అలాంటి సమయం లోనే ఈ నటుడు ఇష్క్ అనే సినిమాలో హీరో గా నటించి మళ్లీ విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత నుండి ఈయన కొన్ని సంవత్సరాల పాటు కెరియర్ను బాగానే కొనసాగించాడు. కానీ మళ్లీ ఈ మధ్య కాలంలో ఈయన వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నాడు. ఆఖరుగా ఈ నటుడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంతకాలం క్రితం అక్కినేని అఖిల్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అఖిల్ కెరియర్ లో మొట్ట మొదటి సినిమా. ఈ మూవీ ని దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నితిన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈ మూవీ ద్వారా నితిన్ కి భారీ ఎత్తున నష్టాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆ సినిమా ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చడానికి నితిన్ మూడు సినిమాలు చేయవలసి వచ్చినట్లు కూడా ఆ సమయంలో వార్తలు వచ్చాయి. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: