విశ్వంభర తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఇదే.. స్టార్ డైరెక్టర్ నే పెట్టేసాడుగా..!

Amruth kumar
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా ఉన్నాడు .. రీయంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కానీ సరైన హిట్‌ మాత్రం అందుకోలేకపోతున్నాడు . ఇదే క్రమంలో ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్ వశిష్టతో కలిసి విశ్వంభ‌రా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది . అలాగే ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్ .. టీజర్ కి వచ్చిన స్పందన చూసి ఈ సినిమాను వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల‌ ముందుకు తేవాలని భావిస్తున్నారు.

ఇక వశిష్ట ఎంచుకున్న కథ బాగున్నా గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ ట్రోల్ చేయడంతో.. సినిమాను మరింత పగడ్బందీగా తెరకెక్కించాలని చిరంజీవి ఏ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు తెర‌కెక్కించడానికి సీనియర్ దర్శ‌కుడు వి వి వినాయక్‌ హెల్ప్ కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారట.  అయితే ఎప్పుడు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న‌సమాచారం ప్రకారం చిరంజీవి తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా ఖాళీగానే ఉన్నాడు. అల్లు అర్జున్ తో సినిమా అంటున్న కూడా అది ఇంకా కన్ఫామ్ కాలేదు. మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి విశ్వంభరా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఓ గెస్ట్ రోల్ చేయడానికి కూడా ఓకే చెప్పినట్టు మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్ర‌క‌ట‌న కూడా రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: