సీనియర్స్ లో చిరు తర్వాత ఆ క్రెడిట్ దక్కించుకోనున్న బాలయ్య.. ఖుషిలో బాలయ్య ఫ్యాన్స్..?

Pulgam Srinivas
కొంత కాలం క్రితం మన తెలుగు సినిమాలు ఇతర భాషలలో చాలా తక్కువ శాతం విడుదల అవుతూ ఉండాలి. దానితో మన సినిమాలకు కూడా తక్కువ కలెక్షన్లే వస్తూ ఉండేది. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఏదైనా తెలుగు సినిమా సాధించింది అంటే దానిని చాలా గొప్పగా మనవాళ్ళు చూసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. రాజమౌళి , ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి బడ్జెట్ ఎక్కువగా కావడంతో ఈ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్లాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. దీనికి అన్ని భాషల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి.

దానితో చాలా మంది టాలీవుడ్ హీరోలు తాము నటించిన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరోలలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇక చిరంజీవి తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాలయ్య హీరోగా బోయపాటి కాంబోలో అఖండ 2 మూవీ రూపొందబోతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి బాలయ్య పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: