భవిష్యత్ లో భారీ మల్టీ స్టారర్స్.. ఊహించని కాంబోలు తెరపై చూస్తామా..?

murali krishna
* టాలీవుడ్ లో మళ్ళీ మొదలైన మల్టీ స్టారర్స్ ట్రెండ్
* తెరపై కి రాబోతున్న సరికొత్త కాంబోలు
* టాలీవుడ్ దశ మారాబోతుందా..?

టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ ట్రెండ్ మొదలైంది.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ భారీ సినిమాలకు వేదికగా మారింది.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు పాన్ ఇండియా గేట్లు తెరిచిన రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించాడు.. అంతటితో ఆయన ప్రయాణం ఆగలేదు.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్ లను ఒకే సినిమాలో చూపించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.. ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి మల్టీస్టారర్ సినిమాలకు ఊతమిచ్చినట్లు అయింది..దీనితో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం మల్టీ స్టారర్ కథలను సృష్టించడం మొదలు పెట్టారు.. అయితే ఒకప్పటి లాగా ఇమేజ్ బేస్ తో సినిమాలు చేసే హీరోల మైండ్ సెట్ కూడా మారింది..దీనితో దర్శకులు కొత్త కథలు సృష్టించడం మొదలు పెట్టారు..
బాగా యాక్టింగ్ కి స్కోప్ వుండే కథలు సృష్టిస్తున్నారు..ప్రేక్షకులు సైతం తమ హీరోలను విభిన్న పాత్రలలో చూడాలని అనుకుంటున్నారు.. దీనితో హీరోలు కూడా సరికొత్త పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. త్వరలోనే ఊహించని కాంబోలు తెరపై చూడబోతున్నాము.. ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించాడు..ఇప్పుడు అదే బాటలో ఇతర దర్శకులూ నడుస్తున్నారు.. స్టార్ హీరోలు అయిన మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో మల్టీ స్టారర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే బాలయ్య, చిరంజీవి తాము కలిసి నటించేందుకు సిద్ధం అని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు..అలాగే యంగ్ హీరోలు సైతం స్టార్ హీరోస్ తో కలిసి నటించేందుకు సిద్ధంగా వున్నారు..భవిష్యత్ లో టాలీవుడ్ నుంచి సరికొత్త కాన్సెప్ట్ లు, కాంబినేషన్ లు రాబోతున్నాయి.. టాలీవుడ్ ని చూసి ఇతర ఇండస్ట్రీ హీరోలు సైతం తమ సినిమా ఎంపికలో మార్పులు చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: