అఖండ తాండవం.. సినిమాలోని ఫస్ట్ డైలాగ్ చెప్పేసి అంచనాలు పెంచేసిన బాలయ్య?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఇంకా ఎంతో మంది హీరోలతో సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రేక్షకులకు హిట్ కాంబినేషన్లుగా కొనసాగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి హిట్ కాంబినేషన్లో బోయపాటి బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా  ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. సూపర్ హిట్ సాధించి నిర్మాతల గల్లా పెట్టి కూడా నింపుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకం ఊరికి రాలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి..

 సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యను అభిమానులు ఎలా అయితే తెరమీద చూడాలని అనుకుంటారో.. అలాగే సినిమాను తెరకెక్కించి ఒక సూపర్ హిట్ కొట్టడంలో సక్సెస్ అవుతూ ఉన్నాడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ సిద్ధమవుతుంది. అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇటీవల  పూజా కార్యక్రమం కూడా జరిగింది. అఖండ తాండవం అనే టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 అయితే అఖండలో బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు అఖండ-2  అఘోరా పాత్ర చుట్టే అటు సినిమా మొత్తం తిరుగుతుంది కాబట్టి.. ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పూజా కార్యక్రమంలో అఖండ 2 నుంచి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పి సినిమాపై అంచనాలను పెంచేసాడు బాలకృష్ణ. ఈ నేల అసురుడిది కాదు ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది.. కాదని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం అంటూ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: