శరీరం చెప్పిన మాట వినండి.. వినకే నేను బెడ్ పై ఉన్నా.. రకుల్ కామెంట్స్ వైరల్?

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజర్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల గురించి అయితే తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. హీరోయిన్లు కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ ఎప్పుడు తమ అప్డేట్లను చెబుతూ ఉంటారు. కొంతమంది హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికీ కిక్కెక్కిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అందుకే అటు సోషల్ మీడియాలో హీరోయిన్లకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం కూడా చూస్తూ ఉంటాం. అందుకే ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారి గురించి ఏదైనా మ్యాటర్ ఇంటర్నెట్ లోకి వచ్చిందంటే చాలు అది కాస్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఇటీవలే రకుల్ జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్న సమయంలో గాయపడింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 80 కేజీల బరువు ఎత్తుతున్న సమయంలో ఆమె వెన్నుముకకు గాయమైంది.

 అయితే గాయమైన వెంటనే హాస్పిటల్కు వెళ్లకుండా నొప్పిని లెక్క చేయకుండా షూటింగ్స్ లో పాల్గొంటూ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఇక గాయం తీవ్రతరం కావడంతో చివరికి ఆసుపత్రి పాలు అయింది  ఫలితంగా ఆరు రోజులుగా ఆమె మంచానికే పరిమితమైంది. అయితే ఇక ఇదే విషయం గురించి ఇటీవలే మాట్లాడిన రకుల్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. నా శరీరం చెప్పిన మాట వినకుండా నేను బరువులు ఎత్తి స్టుపిడ్ పనిచేశాను. చివరికి ఇలా మంచాన పడ్డాను. కానీ మీరు మాత్రం మీ శరీరం చెప్పిన మాట వినండి. శరీరం చెబితే దాన్ని అస్సలు అశ్రద్ధ చేయవద్దు అంటూ రకుల్ అభిమానులకు ఒక సూచన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: