ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే?

praveen
నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఎన్టీ రామారావు వారసుడు బాలకృష్ణ ఒకరు.  ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.  ఒకరు అభిమానులకి గాడ్ ఆఫ్ మాసేస్ గా దగ్గర అయితే ఇంకొకరు మ్యాన్ ఆఫ్ మాసేస్ గా పిలిపించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఒకరు పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా వరుస సూపర్ హిట్ లు సాధిస్తూ దూసుకుపోతుంటే ఇంకొకరు టాలీవుడ్ రేంజ్ లో థియేటర్లను దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు నందమూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు అయినప్పటికీ ఇద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరు కలిస్తే చూడాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఇక ఇప్పుడు అభిమానుల కోరిక తీరబోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఒకే వేదికపై ఎంటర్టైన్ చేయబోతున్నారు.

 ఈ న్యూస్ కాస్త నందమూరి అభిమానులందరికీ కూడా కిక్ ఇస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అన్ స్టాటబుల్ అనే కార్యక్రమంతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అటు నందమూరి ఫ్యామిలీకి బంధువులు అయినా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్ లాంటి వాళ్లు ఈ షో కి గెస్ట్ లుగా వచ్చారు. అయితే ఇక ఇప్పుడు ప్రసారం కాబోయే సీజన్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లను  గెస్ట్ లుగా ఆహ్వానించారు అని తెలుస్తుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నారట. నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇక ఇద్దరూ ఒకే చోట ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు అన్న వార్త వైరల్ గా మారిపోవడంతో.. తెగ సంబర పడిపోతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: