త్రివిక్ర‌మ్ స్టార్ డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి ఆ ఫేడ‌వుట్ హీరోయే కార‌ణం...!

RAMAKRISHNA S.S.
ఒకప్పుడు స్టార్ రైటర్‌గా ఉన్న మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ దర్శకుడుగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం లాంటి యావరేజ్ సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన తర్వాత సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్.. తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో మెగాఫోన్ పెట్టి దర్శకుడుగా మారారు. ఈ క్రమంలోనే తన రెండో సినిమాతోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేశారు.

అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అవటం వెనక ఒక సీనియర్ హీరో ఉన్నారు. స్వయంవరం సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇదే సినిమాతో లయ హీరోయిన్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల ర‌చ‌యిత గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. స్వయంవరం సినిమా కంటే ముందే వేణు భారతీరాజా దర్శకత్వంలో హీరోగా నటించే అవకాశం అందుకున్నాడు. అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో వేణు స్నేహితుడు వెంకట శివప్రసాద్.. ఎస్పి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి మొదటిసారిగా స్వయంవరం సినిమా నిర్మించారు.

ఈ సినిమాతో వేణు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. అయితే వేణు కొన్ని సినిమాలలో నటించి కొన్ని సూపర్ హిట్లు కొట్టినా స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు స్వయంవరం సినిమా ద్వారా వేణు మంచి అవకాశం ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, వర్కింగ్ స్టైల్ చూసిన వేణు మెస్మరైజ్ అయి.. అవకాశం ఇచ్చారు. ఈరోజు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఉంటే.. వేణు ఫేడ్ అవుట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: