బన్నీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఏకైక సినిమా అదే.. ఎంత స్పెషల్ అంటే..!?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో ఒక్కొక్క స్టార్ హీరో ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటేనే ఓ రేంజ్ లో మాట్లాడుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్క సినిమాకి ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ లు అందుకుంటున్నారు . అదంతా పాన్ ఇండియా మహిమనే చెప్పాలి.  అయితే ఇప్పుడు 150 కోట్లు 100 కోట్లు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటున్న స్టార్ హీరోస్ గతంలో తమ కెరియర్లో ఒకానొక సమయంలో సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తాడు మన బన్నీ.. అదేనండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .
అభిమానులు ముద్దుగా బన్నీ బన్నీ అంటూ పిలుచుకుంటూ ఉంటారు.  అల్లు అరవింద్ బ్యాక్ గ్రౌండ్ చూసుకొని మెగాస్టార్ చిరంజీవి అండ చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ తనదైన స్టైల్ లో నటించి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు . డాడీ సినిమాలో గెస్ట్ పాత్రలో మెరిసిన గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.  బన్నీ పలు సినిమాలలో నటిస్తూ ఇప్పుడు పాన్  ఇండియా స్థాయికి ఎదిగిపోయిన బన్నీ.. తన కెరియర్ లో  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమాకి ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు .
ఆ సినిమా మరేదో కాదు "ఎవడు".  రాంచరణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కాజల్ - అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో మెరిశారు. ఈ సినిమా కేవలం చరణ్ మీద ఉన్న ప్రేమతోనే చేశాడట .ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే . ఒకప్పుడు చాలా చాలా క్లోజ్ గా ఉన్న చరణ్ - బన్నీలు ఇప్పుడు ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. కాగా త్వరలోనే పుష్ప2 సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు బన్నీ . డిసెంబర్ 6వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ సినిమా కోసం కోట్లాదిమంది బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: