కొండా సురేఖ "పండుకో" అనే పదం వాడలేదు..రెచ్చిపోయిన లాయర్ ?

Veldandi Saikiran
అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకుల అంశం..ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు..ఈ పెద్ద దుమారాన్ని లేపాయి. ఎక్కడ చూసినా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పు పడుతున్నారు.  కేటీఆర్ ను తిట్టాలి కానీ.. హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకు వచ్చిందని సాటి ప్రజలు కూడా కొండా సురేఖ పై విరుచుకుపడుతున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖను వెనకేసుకొచ్చారు ఆమె తరఫు న్యాయవాదులు. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ తరఫున మహిళా లాయర్..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు కొండా సురేఖ ఎక్కడ కూడా తప్పిదం మాట్లాడలేదని... బూతులు ఎక్కడ వాడలేదని ఆమె పేర్కొన్నారు. పండుకో అనే పదం సమంత గురించి ఎక్కడ వాడలేదని.. కొండ సురేఖను వెనుకేసుకొచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అలాగే హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని... వాళ్ల మధ్య సంబంధాన్ని.. గురించి దారుణంగా మాట్లాడారు మహిళల లాయర్. కొండ సురేఖ పైన కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోదని...ఒకవేళ తీసుకుంటే మేము... రివర్స్ గా అక్కినేని నాగార్జున పైన కేసులు వేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ ఇదంతా నడిపిస్తున్నారని  కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఈ కేసులో కొండా సురేఖ గెలవడం గ్యారెంటీ అని తెలిపారు.

ఇక మరో లాయర్.. కూడా ఇదే వాదనను వినిపించారు. కానీ అక్కినేని నాగార్జున తరఫున లాయర్లు భిన్నంగా మాట్లాడుతున్నారు.  సుప్రియ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని... శుక్రవారం రెండో సాక్షిది కూడా రికార్డు చేసుకుంటారని తెలిపారు. అనంతరం మంత్రి కొండా సురేఖకు నోటీసులు వెళ్తాయని కూడా ఆయన వెల్లడించారు. ఆ నోటీసులపై కొండా సురేఖ స్పందించకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా... అక్కినేని నాగార్జున తరఫున న్యాయవాదులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: