ఎన్టీఆర్ కోసం హీరోయిన్ నే తీసేసిన రాజమౌళి.. ఏకంగా అంత పెద్ద నిర్ణయం..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో తేరకెక్కించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఒక హీరోతో అనుకొని రాసిన కథను మరో హీరోతో తెరకెక్కించిన సందర్భంలో ఆ హీరోకు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు , చేర్పూ చేయవలసి కూడా ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే లో కూడా కొన్ని మార్పులు , చేర్పులు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా కథ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ... అసలు మొదట సింహాద్రి మూవీ కథను బాలకృష్ణ గారి కోసం రాశాము. కాకపోతే ఆయన అప్పటికే అలాంటి జోనర్ సినిమాలు చేసి ఉండడంతో ఇది పెద్దగా సెట్ కాదు , నాపై అస్సలు వర్కౌట్ కాదు అని పక్కన పెట్టేశాడు. ఇక ఆ తర్వాత ఇదే కథను రాజమౌళి , ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడు.

బాలకృష్ణ గారి కోసం రాసిన వర్షన్ లో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్న తర్వాత ఈ సినిమా కథలో ముగ్గురు హీరోయిన్లను తీసేసి కేవలం ఇద్దరూ హీరోయిన్ల పాత్రలు మాత్రమే వచ్చే విధంగా కథలో మార్పులు , చేర్పులు చేశాం అని విజయేంద్ర ప్రసాద్ గారు ఓ ఇంటర్వ్యూ లో బాగంగా తెలియజేశారు. ఇకపోతే సింహాద్రి మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా వీరిద్దరికి కూడా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: