ఏంటి సుధా.. ఈవిడ ఆవిడ ఒకరేనా.. సాయి పల్లవి వెనుక ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..!

Amruth kumar
ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఎన్ని సినిమాలు వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నచ్చుతూ ఉంటాయి. అలాంటి కొన్ని సినిమాల్లో ఒకటి శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ను డైరెక్టర్ హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కించిన ఇందులో శర్వానంద్, సాయి పల్లవి తన నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి ముఖ్యంగా సాయి పల్లవి మనకు లవర్ గా ఉంటే బాగుండును అని అనుకున్న‌రు. తన క్యూట్ ఫర్ఫార్మెన్స్ తో అందర్నీ మెప్పించింది.
ఈ సినిమా 2018 డిసెంబర్ 21న విడుదల అయింది. ఈ సినిమా ను కోల్కతాలో షూట్ చేశారు.. ఇందులో ఓ హీరోయిన్ కూడా నటించింది. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. పడి పడి లేచే మనసు సినిమాలో మమిత బైజు జూనియర్ ఆర్టిస్ట్ గా నటించి అందర్నీ మెప్పించింది. హీరోయిన్ అవ్వక మునుపే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్స్ చేసింది .. అనేక షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా న‌టిచింది . ఇప్పుడు ఈ అమ్మడు ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందరూ ఆమె మమత కాదు అని కూడా అంటున్నారు. కానీ కొందరు మమతా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మమత  ప్రేమలు సినిమాతో పాపులర్ అయింది. మలయాల్లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది.  ఈమె ఈ సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మడికి  క్రేజ్ విపరీతంగా పెరిగింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వర్ష క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గానే దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న విజయ్ 69 సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా ఈమే విజయ్ తో పాటు కలిసి మెరిసింది. ఇప్పటికే ప్రేమలు సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న మమిత.. ఇప్పుడు విజయ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారాలని చూస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో కూడా క్రేజీ సినిమాల్లో కూడా ఈమెకు అవకాశం వచ్చిందని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: