'పోకిరి' లో అసలు ఏముంది..? పూరీ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసే మంచి హిట్ సినిమాలను అందుకున్నారు. ఇలా దర్శకుడిగా అందరీ హీరోలకు ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పోకిరి.ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసిన భారీ స్థాయిలోనే  ఆదరణ లభిస్తుంది . అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కెరీర్ లోనే ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ ఇప్పటివరకు రాలేదు. పూరి జగన్నాథ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పోకిరి సినిమా చేసేటప్పుడు అన్ని సినిమాల లాగే ఈ సినిమాని కూడా చేశామని తెలిపారు.అయితే ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందుకుంటుందని విడుదలకు ముందు మేము అసలు ఊహించలేదని ఈయన తెలియజేశారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అసలు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని నేను చాలా సార్లు ఆలోచించానని తెలిపారు.ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి నేను ప్రసాద్ ల్యాబ్ లో మరోసారి ఈ సినిమా వేసుకొని చూసాను అయితే ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయిందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అన్ని సినిమాలు ఒకే దృష్టితో చేస్తామని అయితే ఏ సినిమా ఎలా ఆడుతుందనే విషయాలను ఎవరు చెప్పలేమనీ ఈ సందర్భంగా పూరి తెలియజేశారు.ఇదిలావుండగా పూరి తన తొలి చిత్రం బద్రి కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ మూవీ కోసం హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను అనుకున్నారట. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్స్ ఫిక్స్ చేసుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదని..ఆ తర్వాత మహేష్ కోసం ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: