ఆ సినిమాను అందుకే కాన్సల్ చేశాం.. శ్రీనువైట్ల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడిగా మారిపోయాడు. ఇకపోతే ఈయన ఢీ , రెడీ , దూకుడు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల సరసన చేరిపోయాడు. ఇక దూకుడు మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. ఆఖరిగా ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన డీ మూవీ అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. మంచు విష్ణు ఈ మూవీ లో హీరో గా నటించగా ... జెనీలియా ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. శ్రీహరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కొంత కాలం క్రితం శ్రీను వైట్ల "డీ" మూవీ కి కొనసాగింపుగా డబల్ డోస్ అనే పేరుతో ఓ మూవీ ని అనౌన్స్ చేశాడు.

కానీ ఈ మూవీ స్టార్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేశాడు. డీ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో నటించాడు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించే నటుడి కోసం అనేక ఆప్షన్స్ వెతికాను. కానీ అంత పర్ఫెక్ట్ నటుడు దొరకలేదు. అందుకే ఆ సినిమాను ఆపివేశం అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: