చిరు విశ్వంభర వచ్చేది అప్పుడే.. మెగా ఫ్యాన్స్ అనుకున్నదే జరగబోతుందిగా..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు . ఆచార్య , బోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్స్‌ తర్వాత చిరు దగ్గర నుంచి వస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా తో సూపర్ హిట్ అందుకున్న‌ దర్శకుడు వశిష్టా డైరెక్షన్లో చిరు ఈ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో స్టార్ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా ఈ మూవీలో నటిస్తుందట. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారనే ఎప్పటినుంచో టాక్ ఉంది
ఇక సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా గా విశ్వంభర వస్తుంది. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అలాగే డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి . అలాగే ఈ సినిమాపై ఇప్పుడు మరో అప్డేట్ కూడా బయటకు వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో రెండు పాట‌లు షూటింగ్ మినహా మిగతా అంతా కంప్లీట్ అయి పోయినట్లుగా తెలుస్తుంది .
ఇక వీటిని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే సన్నాహాలు చిత్ర యూనిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  అయితే మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతి కి రాదు సమ్మర్ కి వస్తుందనే టాక్ కూడా వినిపించింది. వాటిలో నిజం లేదని ఈ సినిమాని సంక్రాంతి కి తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా .. యువి క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మరి చిరంజీవి ఈ సినిమా తో హిట్  కొడతాడో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: