హరిహర వీరమల్లు కోసం మోడీ.. పవన్ పాన్ ఇండియా స్కెచ్ అదిరిపోయిందిగా..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలు, రాజకీయ వ్యవహారాలు కారణంగా కొన్ని సినిమాలు పెండింగ్లో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గా కొన్ని బాధ్యతలు వల్ల ఆ సినిమాల షూటింగ్ ఇంకాస్త ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు ఇలా పెండింగ్లో ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను భారీ స్థాయిలో మొదలుపెట్టారు .. కానీ ఈ మూవీ కోసం ఎక్కువ డేట్స్ కావలసి వచ్చింది అంతే కాదు రాజుల కాలం నాటి కథ‌  కాబట్టి భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కు ఆ టైం లేదు అయిన పొలిటికల్ గా ఇంకాస్త యాక్టివ్ బిజీ అయ్యేసరికి సినిమా పెండింగ్‌ పడుతూ వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కదలిక లేదు. ఇప్పుడు ఈ సినిమాను కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ పూనుకున్నారు పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈసినిమా కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట పవన్. అక్టోబర్ చివరొ కల్లా పవన్ కళ్యాణ్ పోషన్ షూటింగ్ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
అంతేకాకుండా ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ విషయంలో నిర్మాత రత్నం, పవన్ మాట్లాడుకున్నారట. దేశభక్తి సినిమా కావటంతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా రంగంలోకి దింపే ఆలోచనలో కూడా ఉన్నారట పవన్. సినిమా రిలీజ్ కి ముందు మోడీ. అమీత‌షాకు ఈ మూవీని చూపించి వారి చేత సినిమా పై అభిప్రాయం చెప్పించాలని ప్లాన్ చేశారట. ఇక నరేంద్ర మోడీ ఈసినిమా చూసి.. హరిహరవీరమల్లు గురించి మాట్లాడితే.. నార్త్ లో సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాదు పవన్ స్టార్ డమ్ కు మోదీ కూడా తోడైతే.. హరిహరవీరమల్లుకు తిరుగు ఉండదని చెప్పాలి. ఈ రకంగా చూసుకుంటే ఇది పెద్ద ప్లానే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: