దేవరాలో జాన్వికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అంటే.. ఆమె చాలా ఫేమస్..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన దేవర పేరే వినిపిస్తుంది. ఆచార్య అలాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర మంచి కం బ్యాక్ ఇచ్చింది. దాదాపు ఆరు ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి సోలో హీరోగా సినిమా రావ‌డంతో ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖూషి అవుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల మీద దేవర రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబ‌ట్టింది.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ పాత్ర కూడా ఎంతో పాపులర్ అయింది. సినిమాలో కనిపించింది కొద్దిసేపై అయినా తన నటనతో తన అందంతో ప్రేక్షకులను మెరిపించింది. ఇదే క్రమంలో సెకండ్ పార్ట్ జాన్వీ పాత్ర మరింత ఎలివేట్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరు.. ఆమె పేరేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
దేవర సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు జాన్వీ డైలాగ్స్ విని ఆమె కు స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ డబ్బింగ్ చెప్పిందని అంతా భావించారు. కానీ కాదు జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది పీవీఎస్ శ్వేత. ఈ అమ్మడు ఆర్జేగా చాలా పాపులర్. తన వాయిస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శ్వేత క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో యంగ్ బ్యూటీ కృతిశెట్టికి కూడా  శ్వేతనే డబ్బింగ్ చెప్పింది. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇక దేవర సినిమాలో జాన్వికపూర్ కు కూడా శ్వేత డబ్బింగ్ చెప్పి ఆకట్టుకుంది. జాన్వీ పాత్రకు శ్వేత వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది. ఇక ఈ ఆర్జే అమ్మడు సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: