మరీ ఇంత ఘోరంగానా.. ప్లీజ్ ఇకనైనా ఆపండి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆ స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్..!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దేవర 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ నటన అదిరిపోయిందంటూ ప్రశంసలు వస్తున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం దేవర సినిమాను చూసి తారక్ ను మెచ్చుకుంటున్నారు.ఇదిలావుండగా హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో ముని, విజయదశమి, బాణం, కాంచన.. లాంటి పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రెగ్యులర్ గా సినిమాలు చేసి మెప్పించింది వేదిక. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తెలుగులో చివరి సారిగా 2019లో రూలర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో ఓ పాటలో మెరిపించింది. ఇప్పుడు మళ్ళీ అయిదేళ్ల తర్వాత మెయిన్ లీడ్ లో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది వేదిక.

ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ దేవర సినిమా రిలీజ్ తో పండుగ చేసుకున్నారు. అదే క్రమంలో చాలా చోట్ల థియేటర్‌ అద్దాలు, పగులగొట్టడం, ప్రమాదవశాత్తు సుదర్శన్‌ థియేటర్‌లో దేవర ఫ్లెక్లీ కాలిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అవన్నీ ప్రక్కన పెడితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హిరోయిన్‌ వేదిక కూడా ఈ వీడియో పై స్పందించింది. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి అంటూ పోస్టు కూడా పెట్టింది.అసలువిషయ మేమిటంటే ఓ థియేటర్ వద్ద దేవర ఫ్యాన్స్‌ మేకను బలిచ్చారు. ఆ వీడియో చూసి ఆమె స్పందించారు. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి. చూస్తేనే భయంకరంగా ఉంది ఆ అమాయకపు మూగజీవి ఏం చేసింది?. నా హృదయం కలిచివేస్తుంది. అభిమానం పేరిట నోరు లేని మూగజీవిని బలివ్వడం ఏంటి? ఒకరు కాళ్లు పట్టుకుని లాగుతున్నారు, మరొకరు తలపట్టుకున్నారు. ఇంకొకరు తల నరికేశారు. ఆ తలతో పోస్టర్‌కు అభిషేకం చేశారు.జంతు బలి ఎవరూ మెచ్చుకోరు. ఆ నోరులేని మూగజీవి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతున్నాను. ఇలాంటివి మళ్లీ పునరావృతంగా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాని ఆమె పోస్టు పెట్టారు. ఈ వీడియోలో జంతువులపై జరుగుతున్న ఈ దారుణానికి సంబంధించి పెటాను కూడా ఆమె ట్యాగ్‌ చేశారు.ఇదిలావుండగా ప్రస్తుతం వేదిక మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ‘ఫియర్’ అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో  హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వేదిక ఫియర్ సినిమాని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తుండగా సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మహిళా దర్శకురాలు హరిత గోగినేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నటుడు అరవింద్ కృష్ణ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: