బాల‌య్య కాళ్లు మొక్కి.. పాదం తాకి మ‌రీ ఐశ్వ‌ర్యారాయ్ ఏం చేసిందో చూడండి... !

Divya
తెలుగు సినిమా ఖ్యాతి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అని తేడా లేకుండా చాలామంది ఎన్నో అవార్డులను రివార్డులను కొల్లగొడుతున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం చిరంజీవి అద్భుతమైన డ్యాన్సులతో  గిన్నిస్  రికార్డు అందుకున్నారు.తాజాగా అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ,శాండిల్ వుడ్  ఇలా అన్ని భాషలలో నుంచి చాలామంది సెలబ్రిటీలు ఇక్కడికి రావడం జరిగింది.

అయితే ఇటువంటి కార్యక్రమంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.. అదేమిటంటే పోన్నియన్ సెల్వన్  సినిమాకి గాను ఐశ్వర్య రాయ్ కి తమిళంలో బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకుంది.. అయితే ఈ అవార్డుని నందమూరి బాలయ్య చేతులమీదుగా అందుకోవడం గమనార్హం. అయితే ఈ క్రమంలోనే ఈ అవార్డును అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చిన ఐశ్వర్యారాయ్ అవార్డును అందుకునే ముందు నందమూరి నరసింహ బాలయ్య కాళ్లకు నమస్కరించడం అబుదాబి వేడుకలలో హైలెట్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు ఈ విషయం పైన ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియోను ఫోటోలను కూడా అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. గతంలో బాలయ్య పై చాలామంది దురుద్ధ్యేశంతోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఐశ్వర్యారాయ్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా  బాలయ్య ఆశీర్వాదం పొందడానికి ఏకంగా ఆయన కాళ్ళకి మొక్కడంతో ఆయన గుణం ఎలాంటిదో ఇప్పుడు తెలిసిందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి చిరంజీవి వెంకటేష్ వంటి వారు కూడా రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకు సంబంధించిన ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. బాలకృష్ణ పైకి కోపంగా కనిపించినా లోపల మాత్రం సద్గుణంతో మెలుగుతారని , ఆయనతో పనిచేసిన చాలా మంది ఆయన చిన్న పిల్లవాడితో సమానం అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: