ఆ తేదీకైనా హరిహర వీరమల్లు వస్తుందా.. ఈసారి రాకుంటే సినిమాపై బజ్ కష్టమేనా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాను స్టార్ట్ చేసి దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దానితో క్రిష్ జాగర్లమూడి కూడా ఈ మూవీ ని పక్కన పెట్టేసి కొండపొలం అనే మూవీ ని రూపొందించాడు. ఇలా వీరిద్దరూ ఈ సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాలను రూపొందించి విడుదల కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ ఈ సినిమా స్టార్ట్ చేశారు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక మళ్ళీ ఈ మూవీ వాయిదా పడింది.
 

దానితో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం మొదలు పెట్టి ఇప్పటికి కూడా ఈ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. ఇకపోతే ఈ సినిమాను ఆ తేదీన విడుదల చేస్తాము... ఆ నెలలో విడుదల చేయనున్నాము అని ఈ మూవీ బృందం అనే తేదీలను ప్రకటించింది. కానీ ఆ తేదీలలో ఈ మూవీ విడుదల కాలేదు.

ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ తేదీకైనా ఈ సినిమా వస్తుందా ... లేదా అనేది చూడాలి. ఇప్పటికి కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 28 వ తేదీన కూడా విడుదల కానట్లయితే ఈ మూవీ పై క్రేజ్ జనాల్లో చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరి మార్చి 28 వ తేదీన ఈ మూవీ విడుదల అవుతుందా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: