ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ భ‌ర్త‌కు యాక్సిడెంట్‌... ఐసీయూలో చికిత్స‌.. సీరియ‌స్ కండీష‌న్‌..?

Anilkumar
పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల్లో తమ్ముడు ఒకటి. 1999లో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజయి ఇప్పటికే  25 సంవత్సరాలు కావడం విశేషం. ఈ సినిమాలో ప్రీతీ జింగ్యానీ హీరోయిన్ గా నటించగా సెకండ్ హీరోయిన్ గా అదితి గోవిత్రికర్ నటించింది. ఇక బాలీవుడ్ బ్యూటీ అయిన ప్రీతి జింగ్వాని తెలుగులో తమ్ముడు నరసింహనాయుడు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నది. ఇదిలా ఉంటే ప్రీతి జింగ్యానీ భర్త, బీటౌన్ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

 ఈ నేపథ్యంలో ఆయన బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే చికిత్స అందుకుంటున్నట్లు ఆయన టీమ్‌ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కదా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆమెతోపాటు ప్రో పంజా లీగ్ మెంబర్స్ సైతం హాస్పిటల్ కి చేరుకొని ప్రీతీ జింగ్వనీ భర్తను పరామర్శించినట్లుగా సమాచారం. అనంతరం ఆయన్ని పరామర్శించిన ప్రో పంజా లీగ్ టీం ఆయన హెల్త్ పై అప్డేట్ సైతం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే వారు మాట్లాడుతూ.. పర్వీన్ చికిత్సకు

 రెస్పాండ్ అవుతున్నారు.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తామని తెలపడంతో సినీ ప్రేక్షకులు సినీ ప్రముఖులు త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ప్రీతి జుంగ్వాని భర్త పర్వీన్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన దర్శకుడు మరియు ప్రో పంజా లీగ్ కో ఫౌండర్ అని తెలుస్తోంది. అయితే ప్రీతి తెలుగులో పలు సినిమాలు చేసి ఆ తర్వాత పర్వీన్ తో ప్రేమలో పడింది. అలా తన కెరియర్ పిక్స్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునీ ఒకటయ్యారు.. అలా ప్రస్తుతం వాళ్ళిద్దరూ తమ సంసార జీవితాన్ని సాఫీగా సాగిస్తున్న సమయంలో పర్వీన్ కి ఇలా ఆక్సిడెంట్ అవ్వడంతో  కన్నీరు మున్నీరు అవుతోంది ప్రీతీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: