‘లగ్గం టైం’ని థియేటర్ నుంచి వ‌చ్చాక కూడా నువ్వులే న‌వ్వులు...!

RAMAKRISHNA S.S.
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నారు.  ఈక్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’ కథ కంటే ముందు నేను విన్న కథలన్నీ కూడా రక్తపాతంతో కూడుకున్నవే. కానీ ఈ కథ విన్న వెంటనే సినిమాని చేయాలని అనిపించింది. ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మీడియా ఇచ్చిన సపోర్ట్ వల్ల మా చిత్రం ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. అందరినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 6న మా మూవీనీ అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.


నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ .. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ‘లగ్గం టైం’ని నిర్మించాం. మా సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నాం. మా మూవీని చూసి బాగుందా? లేదా? అన్న అభిప్రాయాన్ని ఆడియెన్స్ చెబుతారని ఆశిస్తున్నాం. కానీ ఈ రీ రిలీజ్‌ల వల్ల మాలాంటి చిన్న నిర్మాతలు, చిన్న చిత్రాలకు అంతగా గుర్తింపు రావడం లేదు. ఈ రీ రిలీజ్‌లను కూడా శుక్రవారం, వీకెండ్‌కే విడుదల చేస్తుంటే.. మాలాంటి చిన్న చిత్రాలకు అంతగా ఆదరణ లభించదు. మాలాంటి చిన్న సినిమాలకు వీకెండ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ రీ రిలీజ్‌ల విషయంలో ఒకసారి అందరూ ఆలోచించాలి. ‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్పూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను’ అని అన్నారు.


దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’ మూవీని టీం అంతా కలిసి చాలా బాగా తీశాం. మేమంతా కొత్త వాళ్లం. అలా అందరం కొత్త వాళ్లమే సినిమాని తీసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చూసుకున్నాం. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా హీరో రాజేష్, హీరోయిన్ నవ్య, నిర్మాత హిమబిందు, నెల్లూరు సుదర్శన్, ఇతర టీంకు థాంక్స్. ఫిబ్రవరి 6న మా చిత్రం రాబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అందరూ చూసి మెచ్చుకునేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.


కొరియోగ్రాఫర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన రాజేష్ గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన హీరోయిన్ గారికి థాంక్స్. ఈ చిత్రం ఫిబ్రవరి 6న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ విశ్వనాధ్ కూచనపల్లి మాట్లాడుతూ .. ‘నాకు ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలంటే ఇష్టం. కానీ ఇంత వరకు హారర్, థ్రిల్లర్ సినిమాలు చేశాను. ‘లగ్గం టైం’కి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టులోకి చివరగా నేను వచ్చాను. నాకు ఈ అవకావం ఇచ్చిన దర్శకుడు ప్రజోత్‌కి థాంక్స్. ఇది మాత్రం చిన్న సినిమాలా ఎక్కడా అనిపించదు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.


సంగీత దర్శకుడు పవన్ మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’లో మంచి పాటలుంటాయి. ఇందులోని మెలోడీస్ అందరినీ ఆకట్టుకుంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫిబ్రవరి 6న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు. క్యాస్టూమ్ డిజైనర్ రెతీషా రెడ్డి మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’ సినిమా అవుట్ పుట్ చూస్తే ఎక్కడా కూడా చిన్న సినిమా అన్నట్టుగా ఉండదు. అవుట్ ఫిట్స్‌కి ఇప్పటికే మంచి ప్రశంసలు వస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.


సినిమాటోగ్రఫర్ పవన్ గుంటుకు .. ‘‘లగ్గం టైం’ కోసం దర్శకుడు ప్రజోత్ చాలా కష్టపడ్డాడు. ఇది ఎక్కడా కూడా చిన్న చిత్రం అన్నట్టుగా ఉండదు. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. తారాగణం: రాజేష్ మేరు, నవ్య చిట్యాల, నెల్లూరు సుదర్శన్, ప్రీతీ సుందర్, ప్రణీత్ రెడ్డి, కేదార్ శంకర్, మధుమణి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుజాత, కిరణ్ మచ్చ, నీలా రమణ, అరుణ్ కుమార్, పూజా సింఘ్వి, ప్రదీప్, మిర్చి కిరణ్, ఈరోజుల్లో సాయి తదితరులు న‌టిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: