హరిహర వీరమల్లు సినిమా పైన పవన్ ఫోకస్.. ఎందుకంటే..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు కూడా ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉంది. ఇక మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని సమయంలో ఫైనల్‌గా ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్ర నిర్మాణం వహిస్తున్నారు. ఇకపోతే సెప్టెంబరు 23న షూటింగ్ రీస్టార్ట్ కానుందని.. హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ

 యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ స్టార్ పాల్గొంటారని తెలిపారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు.  అయితే వాస్తవానికి ‘హరిహర వీరమల్లు’ పై అభిమానుల్లో పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడు క్రిష్  చేసిన గత సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకోవచ్చు. అయినప్పటికీ ఇది కోవిడ్ కి ముందు మొదలుపెట్టిన సినిమా. నిర్మాత ఏ ఎం రత్నం వడ్డీల రూపంలో భారీ మొత్తం చెల్లిస్తున్నారు.అతనిపై మరింత భారం పెట్టడం పవన్ కి ఇష్టం లేదు. అందుకే ముందుగా పవన్ ‘హరిహర వీరమల్లు’ కి డేట్స్ ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.

ఇక హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేసింది దర్శకుడు క్రిష్ అయినప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దింపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: